ETV Bharat / state

సంరక్షణ ఖర్చు లక్షలు.. అయినా ఎండిన మొక్కలు - లక్షల్లో నాటారు..బతికింది మాత్రం కొన్నే.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనం మనం కార్యక్రమం.... అధికారుల నిర్లక్ష్యంతో మోడువారుతోంది. భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొక్కల పెంపకం.. ఆచరణలో విఫలమవుతోంది. ఇన్నాళ్లూ నాటిన మొక్కలు ఎండిపోయిన కారణంగా.. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది.

'నీరు'గారుతున్న వనం-మనం
author img

By

Published : Jul 30, 2019, 6:36 PM IST

సంరక్షణ చర్యలు చేపట్టాలి

పశ్చిమ గోదావరి జిల్లా వనం - మనం కార్యక్రమం.. ఆదిలోనే హంసపాదుగా తయారైంది. అడుగు ముందుకు పడక.. అసలు లక్ష్యం నీరుగారుతోంది. అధికారుల నిర్లక్ష్యమో.. సంరక్షణలో లోపమో.. కారణమేదైనా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 11 లక్షల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేని ఫలితంగా... ఇప్పటికే 80 శాతం మొక్కలు ఎండిపోవడం.. వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

జిల్లాలో 909 పంచాయతీలున్నాయి. వాటిలోని 720 పంచాయతీల పరిధిలో.. 2018 - 19 ఏడాదికి గాను.. 2 వేల 726 కిలో మీటర్ల మేర 11 లక్షలు మొక్కలు నాటారు. వీటి సంరక్షణ కోసం 9 లక్షల 12 వేలు, నీరు పోసేందుకు 8 లక్షల 13 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ... నాటిన మొక్కలు 20 శాతం మేర కూడా బతకలేదు. ఇప్పటికే వాడిపోయి.. మోడువారాయి. నాటిన మొక్కలు 70 శాతం వరకు బతికించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నా.. అందుకు రివర్స్ ఫలితాలు కనిపిస్తుండడం వెనక తప్పు ఎవరిదన్నదీ తేలాల్సి ఉంది.

మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాక... అధికారులు సంరక్షణ చర్యల్లో భాగమైతేనే.. ప్రస్తుత పరిస్థితి కాస్త మారే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

సంరక్షణ చర్యలు చేపట్టాలి

పశ్చిమ గోదావరి జిల్లా వనం - మనం కార్యక్రమం.. ఆదిలోనే హంసపాదుగా తయారైంది. అడుగు ముందుకు పడక.. అసలు లక్ష్యం నీరుగారుతోంది. అధికారుల నిర్లక్ష్యమో.. సంరక్షణలో లోపమో.. కారణమేదైనా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 11 లక్షల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేని ఫలితంగా... ఇప్పటికే 80 శాతం మొక్కలు ఎండిపోవడం.. వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

జిల్లాలో 909 పంచాయతీలున్నాయి. వాటిలోని 720 పంచాయతీల పరిధిలో.. 2018 - 19 ఏడాదికి గాను.. 2 వేల 726 కిలో మీటర్ల మేర 11 లక్షలు మొక్కలు నాటారు. వీటి సంరక్షణ కోసం 9 లక్షల 12 వేలు, నీరు పోసేందుకు 8 లక్షల 13 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ... నాటిన మొక్కలు 20 శాతం మేర కూడా బతకలేదు. ఇప్పటికే వాడిపోయి.. మోడువారాయి. నాటిన మొక్కలు 70 శాతం వరకు బతికించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నా.. అందుకు రివర్స్ ఫలితాలు కనిపిస్తుండడం వెనక తప్పు ఎవరిదన్నదీ తేలాల్సి ఉంది.

మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాక... అధికారులు సంరక్షణ చర్యల్లో భాగమైతేనే.. ప్రస్తుత పరిస్థితి కాస్త మారే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:గుంటూరు జిల్లా కొల్లిపర లో ఇసుక కోసం వచ్చిన వారిపై అక్కడ తాసిల్దార్ ఆర్ యశోద ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు నుంచి కోసం అక్కడ అధికారులు ప్రవర్తన అయోమయానికి గురిచేసిందని ప్రజలు అంటున్నారు


విజువల్స్ డస్క్ వాట్సప్ యాప్ కు వచ్చాయి పరిశీలించగలరు


Conclusion:గుంటూరు జిల్లా కొల్లిపర మండలం లో ప్రజల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తాసిల్దార్ యశోద

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.