ETV Bharat / state

ట్విటర్ వార్... 'అమితాబ్​కాంత్ వర్సెస్ ఏపీ సీఎంవో'! - AP local quota

ఆంధ్రప్రదేశ్​లో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం స్థానిక కోటాను వర్తింపజేయాలని వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని జతచేస్తూ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఏపీ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్... ట్వీటర్​లో కాంత్​కు బదులిచ్చారు.

స్థానిక కోటాపై 'అమితాజ్ కాంత్ వర్సెస్ ఏపీ సీఎంవో'
author img

By

Published : Jul 29, 2019, 9:51 PM IST

Updated : Jul 30, 2019, 2:31 AM IST

75 శాతం స్థానిక కోటా కల్పించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ విధానం సమాఖ్య స్ఫూర్తిపై ప్రభావం చూపుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని జతచేసి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్​కాంత్ ఓ ట్వీట్ చేశారు. పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పని చేసుకునేందుకు రాజ్యాంగం వీలుకల్పించిందన్నారు. ఏపీ తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెనుప్రభావం పడుతుందని, మార్కెట్లపైనా ప్రభావం తప్పదని ఈ కథనం పేర్కొంది.

స్థానిక కోటాపై 'అమితాజ్ కాంత్ వర్సెస్ ఏపీ సీఎంవో'

అమితాబ్​కాంత్ ట్వీట్​పై ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్పందించారు. ఈ కథనం అసమగ్ర సమాచారంతో ఉందని పీవీ రమేష్ ఓ ట్వీట్​లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. అంతేకానీ సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ సమాధానంపై స్పందించిన అమితాబ్​కాంత్ అవి తన వ్యాఖ్యలు కావని దినపత్రిక రాసిన కథనాన్ని మాత్రమే పోస్టు చేసినట్టు మరో ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి : 'పెద్దలసభలో ఉన్నారు... పెద్దరికం తెచ్చుకోండి'

75 శాతం స్థానిక కోటా కల్పించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ విధానం సమాఖ్య స్ఫూర్తిపై ప్రభావం చూపుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని జతచేసి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్​కాంత్ ఓ ట్వీట్ చేశారు. పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పని చేసుకునేందుకు రాజ్యాంగం వీలుకల్పించిందన్నారు. ఏపీ తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెనుప్రభావం పడుతుందని, మార్కెట్లపైనా ప్రభావం తప్పదని ఈ కథనం పేర్కొంది.

స్థానిక కోటాపై 'అమితాజ్ కాంత్ వర్సెస్ ఏపీ సీఎంవో'

అమితాబ్​కాంత్ ట్వీట్​పై ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్పందించారు. ఈ కథనం అసమగ్ర సమాచారంతో ఉందని పీవీ రమేష్ ఓ ట్వీట్​లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. అంతేకానీ సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ సమాధానంపై స్పందించిన అమితాబ్​కాంత్ అవి తన వ్యాఖ్యలు కావని దినపత్రిక రాసిన కథనాన్ని మాత్రమే పోస్టు చేసినట్టు మరో ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి : 'పెద్దలసభలో ఉన్నారు... పెద్దరికం తెచ్చుకోండి'

Intro:kit 736

ప్రాణభయంతో అన్నధాతలు


Body:ప్రాణభయంతో అన్నధాతలు


Conclusion:ప్రాణభయంతో అన్నధాతలు
Last Updated : Jul 30, 2019, 2:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.