ETV Bharat / state

Inhumanity: తల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారులు! - కన్నతల్లినే ఇంట్లోకి రానివ్వని కొడుకులు

నవమాసాలు మోసి కనిపెంచింది ఆ అమ్మ. అలాంటి తల్లికి వృద్ధాప్యంలో అండగా నిలవాల్సింది పోయి..వదిలేశారు. అయినా ఆమె చింతించలేదు. పని చేసుకుంటూ జీవనం సాగించింది. ఆరోగ్యం క్షీణించటంతో ఆమె... కుమారుల ఇంటికి వచ్చింది. అటువంటి స్థితిలో ఉన్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా నడిరోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. ఈ అమానుష ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో జరిగింది.

inhumanity on mother
inhumanity on mother
author img

By

Published : May 28, 2021, 10:05 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా..రోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. రోడ్డుపైన ఆటోలోనే 12 గంటలుగా సూర్యకాంతం(80) తలదాచుకుంది.

కొన్నేళ్లుగా ఆకివీడులోని ఓ ఇంట్లో సూర్యకాంతం అద్దెకు ఉంటోంది. గురువారం వడదెబ్బ తగలడంతో ఇంటి యజమాని ఆస్పత్రిలో చూపించారు. చికిత్స తర్వాత ఇంటి యజమాని...ఆమె కుమారులు ఉంటున్న పెదకాపవరానికి పంపించారు. అయితే అనారోగ్యంతో ఉన్న తనను కుమారులు ఇంట్లోకి రానివ్వట్లేదని తల్లి సూర్యకాంతం ఆవేదన వ్యక్తం చేసింది.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా..రోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. రోడ్డుపైన ఆటోలోనే 12 గంటలుగా సూర్యకాంతం(80) తలదాచుకుంది.

కొన్నేళ్లుగా ఆకివీడులోని ఓ ఇంట్లో సూర్యకాంతం అద్దెకు ఉంటోంది. గురువారం వడదెబ్బ తగలడంతో ఇంటి యజమాని ఆస్పత్రిలో చూపించారు. చికిత్స తర్వాత ఇంటి యజమాని...ఆమె కుమారులు ఉంటున్న పెదకాపవరానికి పంపించారు. అయితే అనారోగ్యంతో ఉన్న తనను కుమారులు ఇంట్లోకి రానివ్వట్లేదని తల్లి సూర్యకాంతం ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:

Corona: ఉమ్మడి కుటుంబంలో విషాదం..నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.