ETV Bharat / state

'ఇసుకను బ్లాక్ మార్కెట్​లో విక్రయిస్తున్నారు'

author img

By

Published : Oct 19, 2019, 8:47 PM IST

ఇసుక కొరతను నిరసిస్తూ... ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు... ఎమ్మెల్యే మంతెన రామరాజు చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

మంతెన రామరాజు

ఇసుక కొరతను నిరసిస్తూ... ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు... ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు. నూతన ఇసుక విధానం వచ్చి నెలన్నర దాటినా... ఇంకా ఇసుక దొరకడంలేదని మంతెన ఆరోపించారు. ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా... అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదనన్నారు.

కొత్త విధానం గతం కంటే మెరుగ్గా ఉండాలి గాని... ప్రజలు ఇబ్బంది పడేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవెదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంతో పాటు... అనుబంధ వ్యాపారాలు దెబ్బ తిన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని విమర్శించారు. ఇసుకను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ఇసుక కొరతను నిరసిస్తూ... ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు... ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు. నూతన ఇసుక విధానం వచ్చి నెలన్నర దాటినా... ఇంకా ఇసుక దొరకడంలేదని మంతెన ఆరోపించారు. ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా... అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదనన్నారు.

కొత్త విధానం గతం కంటే మెరుగ్గా ఉండాలి గాని... ప్రజలు ఇబ్బంది పడేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవెదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంతో పాటు... అనుబంధ వ్యాపారాలు దెబ్బ తిన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని విమర్శించారు. ఇసుకను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.

మంతెన రామరాజు

ఇదీ చదవండీ... 'ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ విధానం... అంతా పారదర్శకం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.