ETV Bharat / state

కారు ఢీకొని వలస కూలీ మృతి - latest accidents at badampudi in westgodavari

కారు ఢీకొని ఒడిశాకు చెందిన వలస కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి వద్ద జరిగింది.

migrant worker died in a road accident at badampudi in westgodvari
బాదంపూడి వద్ద కారు ఢీకొని వలస కూలీ మృతి
author img

By

Published : Apr 17, 2020, 9:31 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన బడియా పాపయ్య అనే వలస కూలీ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కేఆర్ పురానికి చెందిన పాపయ్య నెల రోజుల క్రితం తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వచ్చాడు. లాక్​డౌన్ కారణంగా స్వరాష్ట్రానికి వెళ్లలేకపోయాడు. కడియద్ద గ్రామానికి చెందిన దారపు రెడ్డి ఆంజనేయులు పాపయ్యతో ఉంగుటూరు మండలంలోని పరిశ్రమలలో పనులు ఉన్నాయని చెప్పాడు. ఇరువురు కాలినడకన ఉంగుటూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు బాదంపూడి వద్దకు వచ్చేసరికి కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర్రాజు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన బడియా పాపయ్య అనే వలస కూలీ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కేఆర్ పురానికి చెందిన పాపయ్య నెల రోజుల క్రితం తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వచ్చాడు. లాక్​డౌన్ కారణంగా స్వరాష్ట్రానికి వెళ్లలేకపోయాడు. కడియద్ద గ్రామానికి చెందిన దారపు రెడ్డి ఆంజనేయులు పాపయ్యతో ఉంగుటూరు మండలంలోని పరిశ్రమలలో పనులు ఉన్నాయని చెప్పాడు. ఇరువురు కాలినడకన ఉంగుటూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు బాదంపూడి వద్దకు వచ్చేసరికి కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర్రాజు తెలిపారు.

ఇదీ చూడండి:రెడ్​జోన్​ ప్రాంతాన్ని పరిశీలించిన డీఐజీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.