ETV Bharat / state

'జల్సా'... మునగాల సాయివెంకట కృష్ణ కథ ఇది..! - mechanic thief arrested in cheborlu

అతను ద్విచక్రవాహనాలకు మరమ్మతులు చేసే మెకానిక్. జల్సాలకు అలవాటు పడిన అతనికి మరో ఇద్దరు తోడయ్యారు. చివరకి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

mechanic thief arrested
వృత్తి మెకానిక్... ప్రవృత్తి దొంగతనాలు!
author img

By

Published : Jan 9, 2020, 12:19 PM IST

Updated : Jan 9, 2020, 9:51 PM IST

'జల్సా'... మునగాల సాయివెంకట కృష్ణ కథ ఇది..!

బైక్ మెకానిక్ జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు. తన గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి చోరీలు చేసేవాడు. ఆ సొత్తును తన బంధువు సాయంతో అమ్మి డబ్బు సంపాదించే వారు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన మునగాల సాయివెంకట కృష్ణ కథ.

జల్సాలకు అలవాటుపడిన సాయికృష్ణ దొంగతనాలు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చినరామచంద్రపురానికి చెందిన గార్లపాటి వెంకటేష్​తో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడేవారు. దొంగిలించిన వాటిని అమ్మేందుకు సాయికృష్ణ బావమరిది లింగంపల్లి దుర్గాప్రసాద్ సాయం చేసేవాడు. చేబ్రోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో వీరిపై దొంగతనం కేసులు నమోదయ్యాయి.

ఈనెల 7న వెల్లమిల్లి జాతీయ రహదారి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముగ్గురు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7.23 లక్షలు ఉంటుందని సీఐ భగవాన్​ప్రసాద్ వెల్లడించారు. ఈ ముఠాను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ నవదీప్ సింగ్ అభినందించినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి: తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు

'జల్సా'... మునగాల సాయివెంకట కృష్ణ కథ ఇది..!

బైక్ మెకానిక్ జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు. తన గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి చోరీలు చేసేవాడు. ఆ సొత్తును తన బంధువు సాయంతో అమ్మి డబ్బు సంపాదించే వారు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన మునగాల సాయివెంకట కృష్ణ కథ.

జల్సాలకు అలవాటుపడిన సాయికృష్ణ దొంగతనాలు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చినరామచంద్రపురానికి చెందిన గార్లపాటి వెంకటేష్​తో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడేవారు. దొంగిలించిన వాటిని అమ్మేందుకు సాయికృష్ణ బావమరిది లింగంపల్లి దుర్గాప్రసాద్ సాయం చేసేవాడు. చేబ్రోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో వీరిపై దొంగతనం కేసులు నమోదయ్యాయి.

ఈనెల 7న వెల్లమిల్లి జాతీయ రహదారి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముగ్గురు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7.23 లక్షలు ఉంటుందని సీఐ భగవాన్​ప్రసాద్ వెల్లడించారు. ఈ ముఠాను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ నవదీప్ సింగ్ అభినందించినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి: తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు

Intro:AP_TPG_76_8_ARREST_AV_10164

వృత్తి మెకానిక్ ప్రవృత్తి దొంగతనాలు

అతను ద్విచక్ర వాహనాలను మరమత్తు చేసే ఒక సాధారణ మెకానిక్. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మరో వ్యక్తి కలిశాడు. వీరికి మరో వ్యక్తి తోడయ్యాడు ఈ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ద్వి చక్ర వాహనాలను దొంగలించడఞ ప్రారంభించారు. దాదాపు 15 చక్రవర్తులను దొంగలించి వాటిని అమ్మి డబ్బు సంపాదించారు. వీరు మీద చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు వీరి పాపం పండి కటకటాల పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గణపవరం సీ ఐ భగవాన్ ప్రసాద్ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన మునగాల సాయి వెంకట కృష్ణ అలియాస్ సాయి ద్విచక్ర వాహనాలను మరమత్తు చేసే ఒక సాధారణ మెకానిక్. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన గార్లపాటి వెంకటేష్ , తోడయ్యాడు. వీరు ఒక బృందంగా ఏర్పడి 2018 నుంచి ద్విచక్ర వాహనాలను దొంగల ప్రారంభించారు. దొంగిలించిన ద్విచక్ర వాహనాలను మునగాల సాయి వెంకట కృష్ణ బావమరిది అయిన ఉంగుటూరు మండలం చిన్న వెల్లమిల్లికి చెందిన లింగంపల్లి దుర్గాప్రసాద్ తో అమ్మిస్తున్నాడు. వీరిపై చేబ్రోలు తోపాటు భీమవరం వన్ టౌన్ , భీమవరం 2 టౌన్, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్, భీమవరం రూరల్, నిడమర్రు, గణపవరం, పాలకోడేరు ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారు. బావగారు ఫిర్యాదుతో కేసులు కూడా నమోదు చేశారు ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన ఉంగుటూరు మండలం వెల్లమిల్లి జాతీయ రహదారి వద్ద వీరు ముగ్గురుని చేబ్రోలు ఎస్ఐ ఐ. వీర్రాజు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి వీరి వద్ద నుంచి ఏడు లక్షల ఇరవై మూడు వేలు విలువచేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


Body:ఉంగుటూరు


Conclusion:9493990333
Last Updated : Jan 9, 2020, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.