ETV Bharat / state

ఒక్క చేప బరువు 25 కేజీలు... మీరు చూశారా..!

author img

By

Published : May 8, 2020, 10:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ చేప దర్శనమిచ్చింది. జిల్లాలోని చేపల మార్కెట్​కు భారీ చేపలు వచ్చాయి. జనాలు ఎగబడి వీటిని కొన్నారు. లాక్​డౌన్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో... మార్కెట్​లోకి భారీ చేపలు వచ్చాయని తెలియగా... ఎగబడి కొనుగోలు చేశారు.

heavy fishes in west godavari dst jangareedygudem
heavy fishes in west godavari dst jangareedygudem

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్​కు అమ్మకానికి భారీగా చేపలు వచ్చాయి. ఒక్కొక్క చేప 20 నుంచి 25 కిలోలు ఉన్నాయి. సమీపంలో ఉన్న ఎర్రకాల్వ జలాశయం నుంచి చేపలు మార్కెట్​కు తీసుకువచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. జలాశయంలో నీరు తగ్గడంతో భారీ చేపలు పడుతున్నట్లు చెప్పారు. ఒక్కొక్క చేప రూ.4 వేల నుంచి 4500 వరకు అమ్ముడుపోయాయి. కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మార్కెట్​లోకి భారీ చేపలు వచ్చాయని తెలియడంతో ప్రజలు ఎగబడి కొనుగోలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్​కు అమ్మకానికి భారీగా చేపలు వచ్చాయి. ఒక్కొక్క చేప 20 నుంచి 25 కిలోలు ఉన్నాయి. సమీపంలో ఉన్న ఎర్రకాల్వ జలాశయం నుంచి చేపలు మార్కెట్​కు తీసుకువచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. జలాశయంలో నీరు తగ్గడంతో భారీ చేపలు పడుతున్నట్లు చెప్పారు. ఒక్కొక్క చేప రూ.4 వేల నుంచి 4500 వరకు అమ్ముడుపోయాయి. కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మార్కెట్​లోకి భారీ చేపలు వచ్చాయని తెలియడంతో ప్రజలు ఎగబడి కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి 'లక్షల మంది వలస కార్మికులకు కరోనా ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.