ETV Bharat / state

రైతుల దీక్షలకు.. చింతమనేని మద్దతు

author img

By

Published : Jan 2, 2020, 1:01 PM IST

రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్​ చేశారు. రైతుల త్యాగాలను మంత్రులు అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు.

ex-mla-chinthamaneni-prabhakar
రైతుల దీక్షలకు.. చింతమనేని మద్దతు
రైతుల దీక్షలకు మద్దతు పలికిన చింతమనేని

అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరులో అన్నదాతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజా పరిపాలన కోసం భూములిచ్చిన రైతులను కష్ట పెడుతున్నారని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఒప్పుకున్న జగన్ నేడు మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, వారి డిమాండ్లను పరిష్కరించాలని చింతమనేని కోరారు. మూడు రాజధానులతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

రైతుల దీక్షలకు మద్దతు పలికిన చింతమనేని

అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరులో అన్నదాతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజా పరిపాలన కోసం భూములిచ్చిన రైతులను కష్ట పెడుతున్నారని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఒప్పుకున్న జగన్ నేడు మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, వారి డిమాండ్లను పరిష్కరించాలని చింతమనేని కోరారు. మూడు రాజధానులతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

ఇవీ చూడండి...

'అరెస్టులు నన్ను భయపెట్టలేవు'

Intro:ap_tpg_82_1_rytulaniraharadeeksa_avb_ap10162


Body:అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరు లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అవసరాల కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులను నేడు కష్టాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఒప్పుకున్న జగన్ నేడు రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు . ఇప్పటికైనా అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని . వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. . మూడు రాజధానులు వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. అమరావతిలోని రాజధాని కొనసాగించి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.