ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

author img

By

Published : Feb 17, 2021, 12:18 PM IST

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం తొలిగంటలో పోలింగ్ మందకొడిగా సాగగా.. 9గంటల నుంచి జోరుగా సాగుతోంది.

election polling in manyam of west godavaric
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం తొలి గంటలో పోలింగ్ మందకొడిగా సాగగా.. 9:00 నుంచి జోరుగా సాగింది. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, ఏలూరుపాడు మండలాల్లో.. తొలి గంటలో 10 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం తొలి గంటలో పోలింగ్ మందకొడిగా సాగగా.. 9:00 నుంచి జోరుగా సాగింది. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, ఏలూరుపాడు మండలాల్లో.. తొలి గంటలో 10 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

ఇదీ చదవండి: కార్పొరేటర్​గా పోటీ చేస్తున్న తెదేపా మహిళ అభ్యర్థిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.