పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీఎంపీ బాపిరాజు హాజరయ్యారు. తన స్వగ్రామంలో మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు జరగటం ఆనందంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ నాయకులను సన్మానించారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: భీమవరంలో యువ క్రీడాకారుల మధ్య ఉత్కంఠ పోరు