ETV Bharat / state

ఏలూరు కార్మికశాఖ కార్యాలయంలో అనిశా అధికారుల తనిఖీలు

author img

By

Published : Mar 4, 2021, 10:39 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. కార్మికశాఖ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు.

acb officers inspect the Eluru labor department office
ఏలూరు కార్మికశాఖ కార్యాలయంలో అనిశా అధికారుల తనిఖీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్మిక శాఖ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనిశా డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికశాఖ కార్యాలయంలో ఒక వ్యక్తి నకిలీ ధ్రువ పత్రాలతో పని చేస్తున్నాడని, కార్యాలయంలో అక్రమంగా పదోన్నతులు కల్పించారని తెలిపారు. అధికారులు వసూలు చేయాల్సిన సెస్​కు సంబంధించి రూ.79 కోట్లు వసూలు చేయకపోవడం, వివిధ కంపెనీలకు విధించిన జరిమానాలు ఆలస్యంగా వసూలు చేయడం, కొన్నిచోట్ల చేయకపోవడం తదితర విషయాలను గుర్తించామని అన్నారు. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తైన వెంటనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్మిక శాఖ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనిశా డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికశాఖ కార్యాలయంలో ఒక వ్యక్తి నకిలీ ధ్రువ పత్రాలతో పని చేస్తున్నాడని, కార్యాలయంలో అక్రమంగా పదోన్నతులు కల్పించారని తెలిపారు. అధికారులు వసూలు చేయాల్సిన సెస్​కు సంబంధించి రూ.79 కోట్లు వసూలు చేయకపోవడం, వివిధ కంపెనీలకు విధించిన జరిమానాలు ఆలస్యంగా వసూలు చేయడం, కొన్నిచోట్ల చేయకపోవడం తదితర విషయాలను గుర్తించామని అన్నారు. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తైన వెంటనే వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.