ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య..!

author img

By

Published : Dec 1, 2019, 6:10 PM IST

అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శివారులో జరిగింది.

ప్రియుడితో భర్తను అంతమెుందించిన భార్య... అక్రమసంబంధమే కారణం
ప్రియుడితో భర్తను అంతమెుందించిన భార్య... అక్రమసంబంధమే కారణం
ప్రియుడితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య..!

ఏలూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య అంతమెుందించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే... ప్రియుడితో కలిసి చంపించింది. ఈ ఘటన తిమ్మారావుగూడెంలో జరిగింది.

ఇది జరిగింది...
తిమ్మారావుగూడెం గ్రామానికి చెందిన గోవాడ కృష్ణ, మరియమ్మలు భార్య భర్తలు. కృష్ణ ఎస్​బీఐ మెయిన్ బ్రాంచ్​లో ఒప్పంద పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు. సంతోషంగా సాగుతున్న వీరి కాపురం... భార్య ప్రవర్తనతో రోడ్డుకెక్కింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి మరియమ్మకు ఫోన్​ ద్వారా పరిచయమయ్యాడు.

ఆ పరిచయం కాస్తా... అక్రమసంబంధానికి దారితీసింది. ఈ విషయం... భర్త కృష్ణకి తెలిసింది. ఇరువురిని మందలించినా... వారి ప్రవర్తనలో మార్పులేదు. వీరి వివాహేతర సంబంధానికి భర్తగా అడ్డుగా ఉన్నాడని కృష్ణని హతమార్చాలనుకున్నారు... భార్య మరియమ్మ, ప్రియుడు రాజేష్. వీరి పథకానికి రాజేష్ స్నేహితుడి గణేష్​కుమార్ తోడయ్యాడు.

గత నెల 29న సాయంత్రం దుగ్గిరాల జాతీయ రహదారి వద్దకు రమ్మని కృష్ణను పిలిచారు. చేరుకున్న కృష్ణపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే... మార్గమధ్యలో కృష్ణ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా మృతుడు గోవాడ కృష్ణగా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

అనుకున్నది సాధించాడు.... కటకటాలపాలయ్యాడు

ప్రియుడితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య..!

ఏలూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య అంతమెుందించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే... ప్రియుడితో కలిసి చంపించింది. ఈ ఘటన తిమ్మారావుగూడెంలో జరిగింది.

ఇది జరిగింది...
తిమ్మారావుగూడెం గ్రామానికి చెందిన గోవాడ కృష్ణ, మరియమ్మలు భార్య భర్తలు. కృష్ణ ఎస్​బీఐ మెయిన్ బ్రాంచ్​లో ఒప్పంద పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు. సంతోషంగా సాగుతున్న వీరి కాపురం... భార్య ప్రవర్తనతో రోడ్డుకెక్కింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి మరియమ్మకు ఫోన్​ ద్వారా పరిచయమయ్యాడు.

ఆ పరిచయం కాస్తా... అక్రమసంబంధానికి దారితీసింది. ఈ విషయం... భర్త కృష్ణకి తెలిసింది. ఇరువురిని మందలించినా... వారి ప్రవర్తనలో మార్పులేదు. వీరి వివాహేతర సంబంధానికి భర్తగా అడ్డుగా ఉన్నాడని కృష్ణని హతమార్చాలనుకున్నారు... భార్య మరియమ్మ, ప్రియుడు రాజేష్. వీరి పథకానికి రాజేష్ స్నేహితుడి గణేష్​కుమార్ తోడయ్యాడు.

గత నెల 29న సాయంత్రం దుగ్గిరాల జాతీయ రహదారి వద్దకు రమ్మని కృష్ణను పిలిచారు. చేరుకున్న కృష్ణపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే... మార్గమధ్యలో కృష్ణ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేయగా మృతుడు గోవాడ కృష్ణగా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

అనుకున్నది సాధించాడు.... కటకటాలపాలయ్యాడు

Intro:AP_TPG_06_01_ILLEGALE_CONTACT_MURDER_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారులో చోటుచేసుకుంది. ఈ కేసులోని నిందితులను ఏలూరు త్రీ టౌన్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే దర్యాప్తు చేసే వారిని అరెస్టు చేశారు. ఆ వివరాలను ఏలూరు డి ఎస్ పి దిలీప్ కుమార్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.



Body:ఏలూరు మండలం తిమ్మారావు గూడెం గ్రామానికి చెందిన గోవాడ కృష్ణ(41) , మరియమ్మ భార్య భర్తలు. కృష్ణ ఏలూరులోని ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లో పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మేడంకి రాజేష్ అనే అతను గత కొంతకాలంగా మరియమ్మ తో ఫోన్లో పరిచయం ఏర్పర్చుకొని ఆ పరిచయాన్ని కాస్త వివాహేతర సంబంధం గా మార్చుకొని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏ విషయం భర్త కృష్ణ కి తెలిసి ఇరువురిని పట్టుకొని మందలించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు లేకుండా గతంలో గానే అక్రమసంబంధం కొనసాగిస్తున్నారు. వీర అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కృష్ణ ని ఎట్లాగైనా హత మార్చి తమ అడ్డు తొలగించుకోవాలని భార్య మరియమ్మ ప్రియుడు మేడంకి రాజేష్ నిర్ణయించుకున్నారు. వీరు పథకానికి రాజేష్ స్నేహితులైన గణేష్ కుమార్ సహాయం తీసుకున్నారు. గత నెల 29 తేదీ సాయంత్రం భర్త గోవాడ కృష్ణ కు చెందిన కొడుకుకు రావాల్సిన జీతం ఇస్తామని చెప్పి నమ్మించి ఫోన్ చేసి ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని దుగ్గిరాల జాతీయ రహదారిలో ఉన్న వంతెన వద్దకు రమ్మన్నారు.అక్కడ అతనితో గొడవపడి రాయితో తలపై కొట్టి పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి కొన ఊపితో ఉన్న కృష్ణను వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి త్రీటౌన్ సీఐ మూర్తి దర్యాప్తు చేయగా మృతుడు గోవాడ కృష్ణ గా గుర్తించారు. వివాహేతర సంబంధం తో తన భర్తను హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన త్రీ టౌన్ సీఏ మూర్తిని, రామకోటేశ్వరరావు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.


Conclusion:బైట్. దిలీప్ కుమార్ , ఏలూరు డి ఎస్ పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.