ETV Bharat / state

చిలకపాడులో 20 గడ్డివాములు దగ్ధం - పగోజిల్లా చిలకపాడులో 20 గడ్డివాములు దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లా చిలకపాడు, పసలపూడి గ్రామాల పరిధిలో దుండగులు గడ్డివాములకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 20 గడ్డిమేట్లు, ధాన్యం తగలబడింది.

20 loft burned at chilkapadu in west godavari c
కాలుతున్న గడ్డివాములు
author img

By

Published : Dec 12, 2019, 11:47 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు, పసలపూడి గ్రామాల పరిధిలో రహదారుల పక్కనున్న గడ్డిమేట్లకు, ధాన్యం బస్తాలకు దుండగులు నిప్పుపెట్టారు. సుమారు 20 గడ్డిమేట్లకు, రెండుచోట్ల ధాన్యం బస్తాలకు నిప్పంటించారు. సమీపంలో కాపలా ఉన్న రైతులు... స్థానికులకు సమాచారం అందించారు. అప్పటికే గడ్డి పూర్తిగా దగ్ధం కాగా... సుమారు 50 బస్తాల ధాన్యం అగ్నికి ఆహూతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం గడ్డి దొరకని పరిస్థితుల్లో గడ్డివాములు తగలబడటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

చిలకపాడులో 20 గడ్డివాములు దగ్ధం

ఇదీచూడండి.సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య.. ఛేదించిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు, పసలపూడి గ్రామాల పరిధిలో రహదారుల పక్కనున్న గడ్డిమేట్లకు, ధాన్యం బస్తాలకు దుండగులు నిప్పుపెట్టారు. సుమారు 20 గడ్డిమేట్లకు, రెండుచోట్ల ధాన్యం బస్తాలకు నిప్పంటించారు. సమీపంలో కాపలా ఉన్న రైతులు... స్థానికులకు సమాచారం అందించారు. అప్పటికే గడ్డి పూర్తిగా దగ్ధం కాగా... సుమారు 50 బస్తాల ధాన్యం అగ్నికి ఆహూతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం గడ్డి దొరకని పరిస్థితుల్లో గడ్డివాములు తగలబడటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

చిలకపాడులో 20 గడ్డివాములు దగ్ధం

ఇదీచూడండి.సినీఫక్కీలో రైల్వే ఉద్యోగి హత్య.. ఛేదించిన పోలీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.