అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురంలో వైకాపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు భోగాపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రెండు, మూడు ఎకరాలు ఉన్న భూస్వాములను ఇళ్ల స్థలాల జాబితాలో ఎలా చేర్చాలంటూ ప్రశ్నించారు. ఆ భూముల విలువ కోట్లలో ఉంటుందన్నారు.
గ్రామాల్లో లేని వారిని సైతం జాబితాలో చేర్చి స్థలాలు కేటాయించడం అన్యాయమన్నారు. పంచాయతీలో పేదలు చాలా మంది ఉన్నా.. అనర్హులకు ఇవ్వడం సరికాదని ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మార్వో అప్పలనాయుడు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: భారత్లో 20వేలు దాటిన కరోనా మరణాలు