ETV Bharat / state

'ఈ సమయంలో మద్యం దుకాణాలు తెరవడమా?' - విజయనగరలో ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన

కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడంపై ఐద్వా విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు.

women protest against wine shops in vizianagaram
విజయనగరంలో మహిళల ఆందోళన
author img

By

Published : May 5, 2020, 7:10 PM IST

మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలు తెరవడం, రేట్లు పెంచడం సరికాదన్నారు.

బ్రాందీ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని అన్నారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలంతా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలు తెరవడం, రేట్లు పెంచడం సరికాదన్నారు.

బ్రాందీ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని అన్నారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలంతా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

విజయనగరం జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.