ETV Bharat / state

Flash: విజయనగరం జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

author img

By

Published : Aug 13, 2021, 6:02 PM IST

Updated : Aug 14, 2021, 6:22 AM IST

విజయనగరం జిల్లాలో విషాదం
విజయనగరం జిల్లాలో విషాదం

17:58 August 13

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఆ యువకులు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటివరకు బంధుమిత్రులతో కలసి సరదాగా గడిపారు. ఆ మధురానుభూతులతో అక్కడినుంచి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అంతలో వర్షం మొదలవ్వటంతో..సమీపంలోని మామిడితోటలో తలదాచుకున్నారు. అంతలోనే పిడుగు రూపంలో మృత్యువు వారిని కబళించింది. 

ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా చాకలిపేటలో జరిగింది. చాకలిపేటలో తమ బంధువుల వివాహానికి..అదే గ్రామానికి చెందిన ఎర్రిబాబు, సురేశ్‌ హాజరయ్యారు. పెళ్లి ముగిసిన తర్వాత..ఇంటికి బయలుదేరుతుండగా వర్షం రావడం వల్ల పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడి..ఐదుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించే క్రమంలో.. ఎర్రిబాబు, సురేశ్‌ అనే యువకులు మృతి చెందారు.  శ్రీను, వెంకటేష్, పెంటయ్యలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  

ఇదీ చదవండి:

Letter: మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

17:58 August 13

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఆ యువకులు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటివరకు బంధుమిత్రులతో కలసి సరదాగా గడిపారు. ఆ మధురానుభూతులతో అక్కడినుంచి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అంతలో వర్షం మొదలవ్వటంతో..సమీపంలోని మామిడితోటలో తలదాచుకున్నారు. అంతలోనే పిడుగు రూపంలో మృత్యువు వారిని కబళించింది. 

ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా చాకలిపేటలో జరిగింది. చాకలిపేటలో తమ బంధువుల వివాహానికి..అదే గ్రామానికి చెందిన ఎర్రిబాబు, సురేశ్‌ హాజరయ్యారు. పెళ్లి ముగిసిన తర్వాత..ఇంటికి బయలుదేరుతుండగా వర్షం రావడం వల్ల పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడి..ఐదుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించే క్రమంలో.. ఎర్రిబాబు, సురేశ్‌ అనే యువకులు మృతి చెందారు.  శ్రీను, వెంకటేష్, పెంటయ్యలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  

ఇదీ చదవండి:

Letter: మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

Last Updated : Aug 14, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.