మక్కువ పరిధిలోని వెంగళరాయ సాగర్ జలాశయం గట్టు... కోతకు గురవుతోంది. ఎడమ కాలువ తూము గట్టుపై రెండు మీటర్ల వెడల్పు, పొడువుతో గొయ్యి ఏర్పడింది. దాని ద్వారా నీరు కాలువలో కలిసి వృథాగా పోతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గిన కారణంగా ఈ రంధ్రం బయటపడింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తూము పైపులైను శ్లాబు దెబ్బతిన్న కారణంగానే రంధ్రం ఏర్పడిందని వీఆర్ఎస్ జేఈ రాజశేఖర్ చెప్పారు. జైకా నిధులతోనే పనులు చేయగలమన్నారు.
ఇవీ చూడండి: