విజయనగరం జిల్లా తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను చీపురుపల్లిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ప్రణవ్ గోపాల్, జిల్లా నాయకులు కలిశారు. టీఎన్ఎస్ఎఫ్ భవిష్యత్ కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు సూచించారు.
విజయనగరంలో ఎంఆర్ కళాశాలలు.. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు దోహదపడుతున్నాయని అన్నారు. అలాంటి విద్యాసంస్థలు నేటి పాలకుల స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదీచదవండి