ETV Bharat / state

'రైతులకు సంకెళ్లు వేసిన వారిని సస్పెండ్ చేయాలి'

author img

By

Published : Oct 29, 2020, 7:56 PM IST

విజయనగరం జిల్లా తెదెపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితుడైన కిమిడి నాగార్జునను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు కలిసి అభినందించారు. అనంతరం నాగార్జున చీపురుపల్లి తహసీల్దార్ ను కలిసి రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. రైతుల పై ఉన్న కేసును కొట్టివేయాలని వినతి పత్రం అందించారు.

tdp demands to suspend police who arrested farmers
రైతులకు సంకెళ్లు వేసిన వారిని సస్పెండ్ చేయాలి-తెదేపా

విజయనగరం జిల్లా తెదెపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితుడైన కిమిడి నాగార్జునను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నియోజకవర్గంలో పెద్దలను, యువతను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా నాగార్జున అన్నారు.

అనంతరం చీపురుపల్లి తహసీల్దార్ ను కలిశారు. రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్ళు వేయడాన్ని ఖండించారు. అన్నం పెట్టే రైతన్నల చేతికి సంకెళ్ళు వేసి తీసుకురావడం అవమానమని ఆవేదన చెందారు. అన్నదాతలకు సంకెళ్లు వేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. కర్షకులపై ఉన్న కేసును కొట్టివేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అశోక్ గజపతి రాజు కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైకాపాకు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఇవీ చదవండి:

సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు: ఊర్మిళ గజపతిరాజు

విజయనగరం జిల్లా తెదెపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితుడైన కిమిడి నాగార్జునను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నియోజకవర్గంలో పెద్దలను, యువతను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా నాగార్జున అన్నారు.

అనంతరం చీపురుపల్లి తహసీల్దార్ ను కలిశారు. రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్ళు వేయడాన్ని ఖండించారు. అన్నం పెట్టే రైతన్నల చేతికి సంకెళ్ళు వేసి తీసుకురావడం అవమానమని ఆవేదన చెందారు. అన్నదాతలకు సంకెళ్లు వేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. కర్షకులపై ఉన్న కేసును కొట్టివేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అశోక్ గజపతి రాజు కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైకాపాకు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఇవీ చదవండి:

సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు: ఊర్మిళ గజపతిరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.