ETV Bharat / state

Pedapolamamba Jathara: శంబరకు చేరిన పెదపోలమాంబ.. మొదలైన జాతర

author img

By

Published : Dec 28, 2021, 1:07 PM IST

Pedapolamamba jathara: విజయనగరం జిల్లా శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వేళయింది. గ్రామ ఆనవాయితీగా ప్రతీఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి జాతరలో ప్రధాన ఘట్టం నిర్వహించారు. శంబర గ్రామానికి చేరుకున్న పెదపోలమాంబను ప్రత్యేక పూలతో కొలిచి ఆలయానికి ఆహ్వానించారు.

Pedapolamamba jathara
శంబరకు చేరిన పెదపోలమాంబ.. మొదలైన జాతర సంబరం...

Pedapolamamba jathara: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం జిల్లా శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వేళయింది. గ్రామ ఆనవాయితీ ప్రకారం ప్రతీఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.జాతరలో ప్రధాన ఘట్టం.. అమ్మవారిని చదురుగుడి ఆలయానికి తీసుకురావడం. శీబిల్లి పెద్దవలస సమీపంలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారు సోమవారం శంబర గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని నడిమి వీధిలో అమ్మను ప్రత్యేక పూలతో కొలిచి ఆహ్వానించారు. అక్కడనుంచి మేళ తాళాలు, మహిళల కోలాటం, యువత కేరింతలతో చదురు గుడికి తీసుకువచ్చారు.

ఇక ఇప్పటినుంచి జాతర పూర్తయ్యేవరకూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనవరి 3న తొళేళ్లు, 4న ప్రధాన ఉత్సవం, 5న అంపకోత్సవం జరగనున్నాయి. జనవరి 10వ తేదీన చిన్నమ్మవారు(పోలమాంబ)ని తీసుకువచ్చి 24, 25, 26 తేదీల్లో జాతర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డ్ కమిటీ అధ్యక్షుడు పూడి దాలినాయుడు, ఎంపీటీసీ సభ్యులు తీళ్ల పోలినాయుడు, ఈవో బీఎల్ నగేష్, ఉప సర్పంచి అల్లు వెంకటరమణ, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Electric Buses: తిరుమల కొండపై పరుగులు పెట్టనున్న 25 విద్యుత్​ బస్సులు

Pedapolamamba jathara: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం జిల్లా శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వేళయింది. గ్రామ ఆనవాయితీ ప్రకారం ప్రతీఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.జాతరలో ప్రధాన ఘట్టం.. అమ్మవారిని చదురుగుడి ఆలయానికి తీసుకురావడం. శీబిల్లి పెద్దవలస సమీపంలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారు సోమవారం శంబర గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని నడిమి వీధిలో అమ్మను ప్రత్యేక పూలతో కొలిచి ఆహ్వానించారు. అక్కడనుంచి మేళ తాళాలు, మహిళల కోలాటం, యువత కేరింతలతో చదురు గుడికి తీసుకువచ్చారు.

ఇక ఇప్పటినుంచి జాతర పూర్తయ్యేవరకూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనవరి 3న తొళేళ్లు, 4న ప్రధాన ఉత్సవం, 5న అంపకోత్సవం జరగనున్నాయి. జనవరి 10వ తేదీన చిన్నమ్మవారు(పోలమాంబ)ని తీసుకువచ్చి 24, 25, 26 తేదీల్లో జాతర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డ్ కమిటీ అధ్యక్షుడు పూడి దాలినాయుడు, ఎంపీటీసీ సభ్యులు తీళ్ల పోలినాయుడు, ఈవో బీఎల్ నగేష్, ఉప సర్పంచి అల్లు వెంకటరమణ, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Electric Buses: తిరుమల కొండపై పరుగులు పెట్టనున్న 25 విద్యుత్​ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.