ETV Bharat / state

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

author img

By

Published : Sep 3, 2020, 5:42 PM IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మరణించారు. అనంతపురం జిల్లా లో బొలేరో వాహనం లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా..విజయనగరం జిల్లాలో వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైన ఘటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. అనంతపురం జిల్లాలో ద్విచక్రవాహనం పై వెలుతున్న భార్యాభర్తలను కారు వెనక నుంచి ఢీకొన్న ఘటనలో భార్య అక్కడికక్కడే మరణించింది.

road accidents in ap
road accidents in ap

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుండి ఢీకొట్టిన లారీ నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ వాహనాలు రెండు ఉల్లిపాయలు లోడుతో భువనేశ్వర్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద అనంతపురం నుంచి రాయదుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం లారీని ఢీకొన్న ఘటనలో నరేంద్రన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని పెరవలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనం పై వెలతున్న వీరిని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో సావిత్రమ్మ అక్కడికక్కడే మృతి చెందాగా..భర్త వెంకటేసు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుండి ఢీకొట్టిన లారీ నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ వాహనాలు రెండు ఉల్లిపాయలు లోడుతో భువనేశ్వర్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద అనంతపురం నుంచి రాయదుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం లారీని ఢీకొన్న ఘటనలో నరేంద్రన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని పెరవలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనం పై వెలతున్న వీరిని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో సావిత్రమ్మ అక్కడికక్కడే మృతి చెందాగా..భర్త వెంకటేసు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.