ETV Bharat / state

'యువ‌త.. నూతన సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టాలి'

author img

By

Published : Jun 1, 2022, 7:18 PM IST

ప్ర‌స్తుత స‌మాజ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని ఎంపీ సురేష్ ప్రభు తెలిపారు. నేటి త‌రం యువ‌త కొత్త‌గా ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌న్నారు. విజయనగరంలో మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి సురేష్ ప్రభు..త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 ల‌క్ష‌ల రూపాయలు కేటాయించారు.

MP Suresh Prabhu
MP Suresh Prabhu

MP Suresh Prabha @ Vizianagaram: నైపుణ్య‌త‌తో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు త్వ‌రిత‌గ‌తిన ల‌భిస్తాయ‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్ర‌భు పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆలోచించాల‌ని, ప్ర‌స్తుత స‌మాజ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా విద్యార్థుల‌ు నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవ‌లప్​మెంట్ కేంద్రానికి సురేష్ ప్రభు.. త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 ల‌క్ష‌ల రూపాయలు కేటాయించారు. ఆ కేంద్ర భవన నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాధవ్, పలువురు భాజపా నేతలతో కలసి... ఆయన శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం 20 ల‌క్ష‌ల‌ రూపాయలతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి కేటాయించిన ప్ర‌త్యేక అంబులెన్స్​ను జెండా ఊపి ప్రారంభించారు.

నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాలి: ప్ర‌స్తుత స‌మాజంలో ఉపాధి రంగంలో స్థిర ప‌డ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చ‌దువులను అభ్య‌సించాల‌ని విద్యార్థులకు ఎంపీ సురేష్ ప్రభు సూచించారు. ఉద్యోగానికి లేదా స్వ‌యం శ‌క్తితో ఎద‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 1966లో హ‌రిత విప్ల‌వం తర్వాత వ్య‌వ‌సాయ రంగంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేద‌ని, కావున నేటి త‌రం యువ‌త కొత్త‌గా ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని సూచించారు. ప్రస్తుతం 98 శాతం విద్యార్థులు డిగ్రీ పాస్ అవుతున్నార‌ు కానీ.. నాణ్య‌త ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం: ప్ర‌జారోగ్యానికి ప్రాధాన్యత‌ ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని.. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 13 ప్ర‌త్యేక అంబులెన్స్‌ల‌ను అంద‌జేశామ‌ని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు సౌమ్యుల‌ని, మంచి మ‌న‌సున్న వార‌ని అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని గుర్తు చేశారు. అన్ని ర‌కాల ఆచార‌, సంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు క‌ల‌గ‌లిసిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని సురేష్ ప్ర‌భు కితాబిచ్చారు.

సురేష్ ప్ర‌భుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానం ఉంద‌ని, అందుకే నిధుల కేటాయింపులో.. రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వామ్య‌మ‌య్యార‌ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. ఆర్థికంగా, నైతికంగా అన్నివేళ‌లా సురేష్ ప్ర‌భు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నార‌ని ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ మాధ‌వ్ అన్నారు. సురేష్ ప్రభు లాంటి వారి ప్రోత్సాహంతో రాష్ట్రంలోని యువ‌త‌కు ఉత్త‌మ శిక్ష‌ణ అందించి.. మెరుగైన ఉపాధి అవ‌కాశాలు సృష్టిస్తామ‌ని స్కిల్ డెవ‌ల‌ప్​మెంట్ కార్పొరేష‌న్ ఎండీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఎం & హెచ్​వో ర‌మణ కుమారి, సీపీవో బాలాజీ, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య‌లక్ష్మి, జిల్లా స్కిల్ డెవ‌లప్​మెంట్ అధికారి సాయి శ్రీ‌నివాస్‌, ఇత‌ర అధికారులు, భాజపా నాయ‌కురాలు రెడ్డి పావ‌ని, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ అధ్యాప‌కులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan: రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

MP Suresh Prabha @ Vizianagaram: నైపుణ్య‌త‌తో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు త్వ‌రిత‌గ‌తిన ల‌భిస్తాయ‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్ర‌భు పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆలోచించాల‌ని, ప్ర‌స్తుత స‌మాజ అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా విద్యార్థుల‌ు నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవ‌లప్​మెంట్ కేంద్రానికి సురేష్ ప్రభు.. త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 ల‌క్ష‌ల రూపాయలు కేటాయించారు. ఆ కేంద్ర భవన నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాధవ్, పలువురు భాజపా నేతలతో కలసి... ఆయన శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం 20 ల‌క్ష‌ల‌ రూపాయలతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి కేటాయించిన ప్ర‌త్యేక అంబులెన్స్​ను జెండా ఊపి ప్రారంభించారు.

నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాలి: ప్ర‌స్తుత స‌మాజంలో ఉపాధి రంగంలో స్థిర ప‌డ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చ‌దువులను అభ్య‌సించాల‌ని విద్యార్థులకు ఎంపీ సురేష్ ప్రభు సూచించారు. ఉద్యోగానికి లేదా స్వ‌యం శ‌క్తితో ఎద‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 1966లో హ‌రిత విప్ల‌వం తర్వాత వ్య‌వ‌సాయ రంగంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేద‌ని, కావున నేటి త‌రం యువ‌త కొత్త‌గా ఆలోచించి నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని సూచించారు. ప్రస్తుతం 98 శాతం విద్యార్థులు డిగ్రీ పాస్ అవుతున్నార‌ు కానీ.. నాణ్య‌త ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం: ప్ర‌జారోగ్యానికి ప్రాధాన్యత‌ ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని.. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 13 ప్ర‌త్యేక అంబులెన్స్‌ల‌ను అంద‌జేశామ‌ని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు సౌమ్యుల‌ని, మంచి మ‌న‌సున్న వార‌ని అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని గుర్తు చేశారు. అన్ని ర‌కాల ఆచార‌, సంప్ర‌దాయాలు, ప‌ద్ధ‌తులు క‌ల‌గ‌లిసిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని సురేష్ ప్ర‌భు కితాబిచ్చారు.

సురేష్ ప్ర‌భుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానం ఉంద‌ని, అందుకే నిధుల కేటాయింపులో.. రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వామ్య‌మ‌య్యార‌ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. ఆర్థికంగా, నైతికంగా అన్నివేళ‌లా సురేష్ ప్ర‌భు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నార‌ని ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ మాధ‌వ్ అన్నారు. సురేష్ ప్రభు లాంటి వారి ప్రోత్సాహంతో రాష్ట్రంలోని యువ‌త‌కు ఉత్త‌మ శిక్ష‌ణ అందించి.. మెరుగైన ఉపాధి అవ‌కాశాలు సృష్టిస్తామ‌ని స్కిల్ డెవ‌ల‌ప్​మెంట్ కార్పొరేష‌న్ ఎండీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఎం & హెచ్​వో ర‌మణ కుమారి, సీపీవో బాలాజీ, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య‌లక్ష్మి, జిల్లా స్కిల్ డెవ‌లప్​మెంట్ అధికారి సాయి శ్రీ‌నివాస్‌, ఇత‌ర అధికారులు, భాజపా నాయ‌కురాలు రెడ్డి పావ‌ని, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ అధ్యాప‌కులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan: రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.