ETV Bharat / state

ఆదివాసుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jan 10, 2021, 9:52 PM IST

విజయనగరం జిల్లా, సాలూరు మండలంలోని జగ్గు దొరవలసలో గిరిజన హక్కుల కోసం ఆదివాసులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సందర్శించారు. దీక్షను విరమించి తమకు సహకరించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు న్యాయ పోరాటాన్ని విరమింపజేసేది లేదని ఆదివాసీ నాయకులు తేల్చి చెప్పారు.

MLA Peedika Rajanna Dora visited the tribal initiation camp in Salur zone Vizianagaram district
ఆదివాసుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

విజయనగరం జిల్లా, సాలూరు మండలంలోని జగ్గు దొరవలస గ్రామంలో గిరిజన హక్కుల కోసం ఆదివాసులు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష.. నేటికి 45 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షను విరమించి సహకరించాలని గిరిజనులను కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు న్యాయ పోరాటాన్ని విరమింపజేసేది లేదని ఆదివాసీ నాయకులు తేల్చి చెప్పారు. మీతో పరిష్కారం కాకుంటే రాష్ట్ర గవర్నర్ వచ్చేంత వరకూ పోరాటం సాగుతుందని అన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే జయరాజు నిమ్మక, ఐటీడీఏ పీవో, గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆసియాలో మెుదటి రిక్షా కాలనీ.. 1986-87 లో నిర్మాణం

విజయనగరం జిల్లా, సాలూరు మండలంలోని జగ్గు దొరవలస గ్రామంలో గిరిజన హక్కుల కోసం ఆదివాసులు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష.. నేటికి 45 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షను విరమించి సహకరించాలని గిరిజనులను కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు న్యాయ పోరాటాన్ని విరమింపజేసేది లేదని ఆదివాసీ నాయకులు తేల్చి చెప్పారు. మీతో పరిష్కారం కాకుంటే రాష్ట్ర గవర్నర్ వచ్చేంత వరకూ పోరాటం సాగుతుందని అన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే జయరాజు నిమ్మక, ఐటీడీఏ పీవో, గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆసియాలో మెుదటి రిక్షా కాలనీ.. 1986-87 లో నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.