విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరాముడిని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతి రాజు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించగా.. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
భక్తులు ఆలయాలకు ఇచ్చిన విరాళాలు ప్రభుత్వ పాకెట్ మనీ కాదని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. విరాళాలను దేనికైతే సమర్పిస్తారో.. వాటికే వినియోగించాలని సూచించారు. ఆలయాలకు వచ్చిన డబ్బును మీకు నచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని ఇప్పటి వకు పట్టుకోలేదని విమర్శించారు. నాపై కోపం ఉంటే హిందూ మతం, విద్యాలయాలపై దాడులు చేయడం ప్రభుత్వానికి సరికాదన్నారు.
ఇదీచదవండి: CJI NV RAMANA: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీజేఐ