ETV Bharat / state

తోటపల్లి బ్యారేజీ కుడి కాలువకు గండి.. భారీగా నీటి వృథా - తోటపల్లి కాలువకు గండి

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లోని తోటపల్లి బ్యారేజీకి గండి పడింది. సమీపంలోని ఆకు మడుల్లోకి నీరు చేరింది. నీరంతా వృథా అవడమే కాక.. పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా అమలు చేయాలని కోరారు.

hole to vizingaram dst thotapalli barrigae water wastage
hole to vizingaram dst thotapalli barrigae water wastage
author img

By

Published : Jul 14, 2020, 2:21 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లోని తోటపల్లి బ్యారేజీ కుడి కాలువకు గండి పడింది. గరుగుబిల్లి మండలం పెదగుడబ సమీపంలో కాలవ గట్టు తెగిన కారణంగా.. భారీగా నీరు వృథా అయ్యింది. గత నెలలో ఈ కాలువకు సాగునీరు విడిచిపెట్టారు. రైతులు ఆకు మడులు సిద్ధం చేశారు.

మరి కొద్ది రోజుల్లో సాగులో తర్వాత దశకు సన్నద్ధం అవుతున్న తరుణంలో గండి ఆందోళన కలిగిస్తోందని రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న బ్యారేజ్ ఇంజినీరింగ్ అధికారులు.. కాలువలోకి వెళ్లే నీటిని నిలుపుదల చేశారు. అయినప్పటికీ కొంతమేరకు ఆకు మడులు నీట మునిగాయి. అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లోని తోటపల్లి బ్యారేజీ కుడి కాలువకు గండి పడింది. గరుగుబిల్లి మండలం పెదగుడబ సమీపంలో కాలవ గట్టు తెగిన కారణంగా.. భారీగా నీరు వృథా అయ్యింది. గత నెలలో ఈ కాలువకు సాగునీరు విడిచిపెట్టారు. రైతులు ఆకు మడులు సిద్ధం చేశారు.

మరి కొద్ది రోజుల్లో సాగులో తర్వాత దశకు సన్నద్ధం అవుతున్న తరుణంలో గండి ఆందోళన కలిగిస్తోందని రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న బ్యారేజ్ ఇంజినీరింగ్ అధికారులు.. కాలువలోకి వెళ్లే నీటిని నిలుపుదల చేశారు. అయినప్పటికీ కొంతమేరకు ఆకు మడులు నీట మునిగాయి. అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

ఇదీ చూడండి:

భారీ వర్షానికి నారుమడుల మునక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.