ETV Bharat / state

కార్పొరేట్ హాస్పిటల్స్​కు దీటుగా గుంటూరు GGH​లో అరుదైన ఆపరేషన్లు - GUNTUR GGH DOCTORS PERFORMS WELL

అరుదైన శస్త్రచికిత్సలతో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న GUNTUR GGH​-ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఉచితంగా అరుదైన ఆపరేషన్లు

Guntur GGH Doctors Rare Surgeries
Guntur GGH Doctors Rare Surgeries (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2025, 12:34 PM IST

Guntur GGH Doctors Performs Rare Surgeries: గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలే కాదు అరుదైన శస్త్రచికిత్సలతో రోగులకు కొత్త జీవితాన్నిస్తోంది. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయలేక చేతులెత్తేసిన కష్టతరమైన గుండె, ఇతర శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోంది. ఇలాంటి అరుదైన అపరేషన్లను ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సైతం ఆసుపత్రి నిర్వహించడంతో పేదలు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇదే సేవానిరతితో రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందించేందుకు సరికొత్త భవనాలు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతోంది.

అరుదైన గుండె శస్త్రచికిత్సలు: ఉమ్మడి గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఏ జబ్బు చేసినా GGH​​ వైపే చూస్తున్నారు. దాదాపు పదిహేను వందల పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో నిత్యం 2 వేలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. GGH​లో గుండె శస్త్ర చికిత్సలు చేయించుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 60కి పైగా హృదయ సంబంధిత సర్జరీలను GGH​ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

GGH​లో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకొని బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తరువాత కాలంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించేందుకు అప్పటి వైఎస్సార్సీపీ సర్కారు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

గుండె సంబంధిత ఆపరేషన్లే కాకుండా ఇతర అరుదైన సర్జరీలకూ GGH​ చిరునామాగా మారింది. రోడ్డు ప్రమాదంలో పక్కటెముకలతోపాటు గుండెకు రక్షణగా ఉన్న స్టెర్నల్‌ ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన 66 ఏళ్ల చిన్నరామయ్యకు రాష్ట్రంలోనే తొలిసారిగా స్టెర్నల్‌ ప్లేట్‌ ఫిక్సేషన్‌ సర్జరీ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. ఆయనకు చికిత్స అందించలేమని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన తరుణంలో GGH​ వైద్యులు సర్జరీ చేసి ప్రాణాదానం చేశారు.

అదే విధంగా ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌కుమార్‌ అనే యువకుడు పదేళ్లుగా రక్తహీనత సమస్యతో ఏలూరు, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో ఇటీవల GGH​ను ఆశ్రయించారు. ఇక్కడి వైద్యబృందం మొదటగా రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అంతే గాక గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో దీన్ని పెరెనిక్‌ నర్వ్‌ ట్యూమర్‌గా గుర్తించిన GGH​​ వైద్యులు క్లిష్టతరమైన ఆపరేషన్‌ను నిర్వహించి కణితిని తొలగించారు.

త్వరలో అందుబాటులోకి మరిన్నిసేవలు: GUNTUR GGH​​కు పెరుగుతున్న రద్దీ దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ సేవలు అందించేందుకు 2015లోనే నాటి టీడీపీ ప్రభుత్వం సర్వీస్‌ బ్లాక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికి గాను 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన YSRCP సర్కారు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వ రాకతో పెండింగ్ పడిన నిర్మాణంలో కదలిక వచ్చింది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తలపెట్టిన G ప్లస్‌ 4 సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు. దాదాపు రూ.10 కోట్ల సొంత నిధులతో అన్ని సదుపాయాలతో భవనం పూర్తి చేసి ఇచ్చేందుకు ఆయన ముందుకురాగా దానికి వైద్యశాఖ అనుమతులిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ భవనం ద్వారా డైట్ క్యాంటీన్, స్టెరిలైజేషన్‌, స్టీమ్‌ లాండ్రీ, మెడికల్ స్టోర్ విభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

''ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌కుమార్‌ పదేళ్లుగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అతను మా జీజీహెచ్​ను సంప్రదించారు. మా వైద్యబృందం రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేశాం. గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో పెరెనిక్‌ నర్వ్‌ ట్యూమర్‌గా గుర్తించి అరుదైన ఆపరేషన్‌ను సునాయాసంగా పూర్తిచేశాం''-యశస్వి రమణ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్

''పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకోవడం ద్వారా బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు రోగులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ రావడంతో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది''-డాక్టర్ పి.కుప్పుస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్

కాకినాడ వైద్యుల ప్రతిభ - 'అదుర్స్' మూవీ చూపిస్తూ రోగికి బ్రెయిన్​ ఆపరేషన్ - Kakinada GGH Rare Brain Surgery
ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur

కనీస సౌకర్యాలు లేని ఒంగోలు సర్వజన ఆస్పత్రి - ఆందోళనలో రోగులు - Lack Of Facilities in Ongole GGH

Guntur GGH Doctors Performs Rare Surgeries: గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలే కాదు అరుదైన శస్త్రచికిత్సలతో రోగులకు కొత్త జీవితాన్నిస్తోంది. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయలేక చేతులెత్తేసిన కష్టతరమైన గుండె, ఇతర శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోంది. ఇలాంటి అరుదైన అపరేషన్లను ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సైతం ఆసుపత్రి నిర్వహించడంతో పేదలు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇదే సేవానిరతితో రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందించేందుకు సరికొత్త భవనాలు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతోంది.

అరుదైన గుండె శస్త్రచికిత్సలు: ఉమ్మడి గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఏ జబ్బు చేసినా GGH​​ వైపే చూస్తున్నారు. దాదాపు పదిహేను వందల పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో నిత్యం 2 వేలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. GGH​లో గుండె శస్త్ర చికిత్సలు చేయించుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 60కి పైగా హృదయ సంబంధిత సర్జరీలను GGH​ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

GGH​లో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకొని బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తరువాత కాలంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించేందుకు అప్పటి వైఎస్సార్సీపీ సర్కారు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

గుండె సంబంధిత ఆపరేషన్లే కాకుండా ఇతర అరుదైన సర్జరీలకూ GGH​ చిరునామాగా మారింది. రోడ్డు ప్రమాదంలో పక్కటెముకలతోపాటు గుండెకు రక్షణగా ఉన్న స్టెర్నల్‌ ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన 66 ఏళ్ల చిన్నరామయ్యకు రాష్ట్రంలోనే తొలిసారిగా స్టెర్నల్‌ ప్లేట్‌ ఫిక్సేషన్‌ సర్జరీ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. ఆయనకు చికిత్స అందించలేమని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన తరుణంలో GGH​ వైద్యులు సర్జరీ చేసి ప్రాణాదానం చేశారు.

అదే విధంగా ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌కుమార్‌ అనే యువకుడు పదేళ్లుగా రక్తహీనత సమస్యతో ఏలూరు, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో ఇటీవల GGH​ను ఆశ్రయించారు. ఇక్కడి వైద్యబృందం మొదటగా రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అంతే గాక గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో దీన్ని పెరెనిక్‌ నర్వ్‌ ట్యూమర్‌గా గుర్తించిన GGH​​ వైద్యులు క్లిష్టతరమైన ఆపరేషన్‌ను నిర్వహించి కణితిని తొలగించారు.

త్వరలో అందుబాటులోకి మరిన్నిసేవలు: GUNTUR GGH​​కు పెరుగుతున్న రద్దీ దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ సేవలు అందించేందుకు 2015లోనే నాటి టీడీపీ ప్రభుత్వం సర్వీస్‌ బ్లాక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికి గాను 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన YSRCP సర్కారు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వ రాకతో పెండింగ్ పడిన నిర్మాణంలో కదలిక వచ్చింది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తలపెట్టిన G ప్లస్‌ 4 సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు. దాదాపు రూ.10 కోట్ల సొంత నిధులతో అన్ని సదుపాయాలతో భవనం పూర్తి చేసి ఇచ్చేందుకు ఆయన ముందుకురాగా దానికి వైద్యశాఖ అనుమతులిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ భవనం ద్వారా డైట్ క్యాంటీన్, స్టెరిలైజేషన్‌, స్టీమ్‌ లాండ్రీ, మెడికల్ స్టోర్ విభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

''ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌కుమార్‌ పదేళ్లుగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అతను మా జీజీహెచ్​ను సంప్రదించారు. మా వైద్యబృందం రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేశాం. గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో పెరెనిక్‌ నర్వ్‌ ట్యూమర్‌గా గుర్తించి అరుదైన ఆపరేషన్‌ను సునాయాసంగా పూర్తిచేశాం''-యశస్వి రమణ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్

''పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకోవడం ద్వారా బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు రోగులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ రావడంతో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది''-డాక్టర్ పి.కుప్పుస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్

కాకినాడ వైద్యుల ప్రతిభ - 'అదుర్స్' మూవీ చూపిస్తూ రోగికి బ్రెయిన్​ ఆపరేషన్ - Kakinada GGH Rare Brain Surgery
ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur

కనీస సౌకర్యాలు లేని ఒంగోలు సర్వజన ఆస్పత్రి - ఆందోళనలో రోగులు - Lack Of Facilities in Ongole GGH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.