ETV Bharat / state

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి - vizayanagaram district latest newws

సరదాగా చేస్తున్న పనులు యువత ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిత్యం చరవాణులతో బిజీగా గడుపుతూ ఉండే వారు సెల్ఫీల మోజులో పడుతున్నారు. స్వీయచిత్రం తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లా సాలూరులో రైలు ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. విద్యుత్ తీగలు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు ఒ యువకుడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Electric wires hit the young boy at saloor viziaynagaram district
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ
author img

By

Published : Jul 9, 2020, 11:04 PM IST

విజయనగరం జిల్లా సాలూరులో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాలమీదకు తెచ్చింది. బంగారమ్మ కాలనీకి చెందిన బండిమోహన్(14) స్నేహితులతో కలిసి సరదాగా రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. అక్కడ ఓ గూట్స్ రైలు నిలిపి ఉండటంతో తోటి స్నేహితులు వారిస్తున్న వినకుండా రైలు ఎక్కి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.

అక్కడున్న విద్యుత్ తీగలు తగిలి కింద పడిపోయాడు. ఈ లోపే ఆ యువకుడి ఒళ్లంతా కాలిపోయింది. వెంటనే తోటి స్నేహితులు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్- శుక్రవారం నుంచి అమలు​

విజయనగరం జిల్లా సాలూరులో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాలమీదకు తెచ్చింది. బంగారమ్మ కాలనీకి చెందిన బండిమోహన్(14) స్నేహితులతో కలిసి సరదాగా రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. అక్కడ ఓ గూట్స్ రైలు నిలిపి ఉండటంతో తోటి స్నేహితులు వారిస్తున్న వినకుండా రైలు ఎక్కి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.

అక్కడున్న విద్యుత్ తీగలు తగిలి కింద పడిపోయాడు. ఈ లోపే ఆ యువకుడి ఒళ్లంతా కాలిపోయింది. వెంటనే తోటి స్నేహితులు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్- శుక్రవారం నుంచి అమలు​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.