విజయనగరం జిల్లా సాలూరు మండలం మరయ్యపాడు గిరిజన గ్రామానికి చెందిన ఓ గర్భిణీని నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చారు. మైదానప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్లో భోగవలస పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమె బాబుకి జన్మనిచ్చింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు మొరపెట్టుకుంటున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. తమకు రహదారి మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ఆ గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: 'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'