ETV Bharat / state

విజయనగరంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. జనంలో ఆందోళన

author img

By

Published : Jun 24, 2020, 5:48 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవడం మొదలైన తర్వాత 45 రోజుల పాటు గ్రీన్ జోన్ ఉన్న జిల్లా విజయనగరం. లాక్​డౌన్​ను కచ్చితంగా అమలుచేసిన జిల్లాల్లో ప్రథమ వరుసలో ఉన్న జిల్లా. ప్రస్తుతం.. ఆ పరిస్థితి మారింది. జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే విజయనగరం జిల్లా వాసే కావడం.. అందరిలో ఆందోళన పెంచుతోంది.

విజయనగరంలో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి
విజయనగరంలో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

మార్చి 22 జనతా కర్ఫ్యూ మొదలుకొని, మూడు లాక్​డౌన్​లను విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం సమర్థంగా అమలుచేసింది. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు వచ్చిన 45 రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో కేసు నమోదైంది. లాక్​డౌన్​లో కచ్చితమైన నిఘాతో జిల్లాలోకి ఎవరూ రాకుండా పోలీసులు పని చేశారు. కానీ.. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన జిల్లా వాసులు తిరిగి జిల్లాకు రావటం మొదలుపెట్టారు. లక్షలాది మంది వలస కూలీలు నడుచుకుంటూ, లారీలు, ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నారు. ఇలా జిల్లాకు వచ్చిన వలస కూలీల కారణంగా మే 4న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసులు పెరుగుతునే ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య 171కి చేరుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే జిల్లా వాసి కావడం ఆందోళనకరం.

కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే.. జిల్లావాసే

ఈ నెల 10న అమెరికా నుంచి వచ్చిన శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు కరోనాకు గురయ్యారు. అమెరికా నుంచి వచ్చిన నేపథ్యంలో శాసనసభ అధికారులు ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశాలకు అనుమతించలేదు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విజయనగరం వచ్చిన శాసనసభ్యుడు ట్రూ నాట్​ పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. పాజిటివ్ రావటంతో నిర్ధరణ కోసం వైద్యాధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన గన్​మ్యాన్​కూ కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు.

వైరస్ బారిన పడుతున్న అధికారులు

బొబ్బిలి భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో పాటు, కలెక్టరేట్​లో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగికి కరోనా సోకింది. బొబ్బిలికి చెందిన మహిళ ఉద్యోగి ఇటీవల సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్ నిర్వహించిన భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ సమావేశానికి హాజరు కావటంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికాకారులకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు సిద్ధం అవుతున్నారు.

పోలీసు శాఖలోనూ.. కలకలం

విజయనగరం పోలీసు శాఖనూ కరోనా వెంటాడుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పనిచేసి వచ్చిన సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం డివిజన్​లో ఇద్దరు పోలీసు అధికారులు, వారి వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లు, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ పరిస్థితుల కారణంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు.

ఇదీ చదవండి:

కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు

మార్చి 22 జనతా కర్ఫ్యూ మొదలుకొని, మూడు లాక్​డౌన్​లను విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం సమర్థంగా అమలుచేసింది. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు వచ్చిన 45 రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో కేసు నమోదైంది. లాక్​డౌన్​లో కచ్చితమైన నిఘాతో జిల్లాలోకి ఎవరూ రాకుండా పోలీసులు పని చేశారు. కానీ.. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన జిల్లా వాసులు తిరిగి జిల్లాకు రావటం మొదలుపెట్టారు. లక్షలాది మంది వలస కూలీలు నడుచుకుంటూ, లారీలు, ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నారు. ఇలా జిల్లాకు వచ్చిన వలస కూలీల కారణంగా మే 4న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసులు పెరుగుతునే ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య 171కి చేరుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే జిల్లా వాసి కావడం ఆందోళనకరం.

కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే.. జిల్లావాసే

ఈ నెల 10న అమెరికా నుంచి వచ్చిన శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు కరోనాకు గురయ్యారు. అమెరికా నుంచి వచ్చిన నేపథ్యంలో శాసనసభ అధికారులు ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశాలకు అనుమతించలేదు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విజయనగరం వచ్చిన శాసనసభ్యుడు ట్రూ నాట్​ పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. పాజిటివ్ రావటంతో నిర్ధరణ కోసం వైద్యాధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన గన్​మ్యాన్​కూ కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు.

వైరస్ బారిన పడుతున్న అధికారులు

బొబ్బిలి భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో పాటు, కలెక్టరేట్​లో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగికి కరోనా సోకింది. బొబ్బిలికి చెందిన మహిళ ఉద్యోగి ఇటీవల సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్ నిర్వహించిన భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ సమావేశానికి హాజరు కావటంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికాకారులకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు సిద్ధం అవుతున్నారు.

పోలీసు శాఖలోనూ.. కలకలం

విజయనగరం పోలీసు శాఖనూ కరోనా వెంటాడుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పనిచేసి వచ్చిన సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం డివిజన్​లో ఇద్దరు పోలీసు అధికారులు, వారి వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లు, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ పరిస్థితుల కారణంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు.

ఇదీ చదవండి:

కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.