ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.

author img

By

Published : Dec 14, 2020, 5:00 PM IST

dharna in vizianagaram
వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ నిరసన

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఎం నాయకులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఎం నాయకులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

రైతులకు మద్దతుగా ఈనెల 21న కాంగ్రెస్ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.