విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకూతిలో గ్రామీణ వికాస్ బ్యాంక్ తరుపున బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్న మనోహర్ (29) కొవిడ్ తో మృతి చెందాడు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ.. మరణించినట్లు బంధువులు తెలిపారు. అతనికి ఈ నెల 23న బొబ్బిలికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది.
కరోనా నుంచి కోలుకొని తిరిగి వస్తాడని పెద్దలు పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలోనే అతడు మృతి చెందటంతో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
ఇదీ చదవండీ.. 'పరిషత్ ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'