ETV Bharat / state

బాబామెట్ట దర్గా దర్బార్​లో 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు - విజయనగరంలో 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు వార్తలు

విజయనగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రమైన.. బాబామెట్ట దర్గా దర్బార్​లో 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖురాన్ పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

62nd Maha Sufi Festival at Babametta Darga Darbar in vizianagaram
బాబామెట్ట దర్గా దర్బార్​లో 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు
author img

By

Published : Mar 22, 2021, 7:48 PM IST

విజయనగరం జిల్లాలోని బాబామెట్ట దర్గా దర్బార్​లో.. హజరత్ తాజ్ ఖాదర్ వలీబాబా 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్ధనలతో ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయని దర్బార్ ముతవల్లి (ధర్మకర్త) మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా తెలిపారు. అనంతరం జెండా ఉత్సవం, ఛాదర్ సమర్పణ వంటి ఉత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖాదర్ బాబా దర్గా షరీఫ్ వద్ద ఖురాన్ పఠనం ఉంటుందని తెలిపారు.

ఉదయం 10 గంటలకు దర్భార్ షరీఫ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై.. హజరత్ తాజ్ ఖాదర్ వలీ బాబా, నషాన్, చాదర్, సందల్ షరీఫ్​లతో పాటు ఫకీరు మేళా ఖవ్వాలితో నగర పుర వీధుల్లోకి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. చాదర్ సమర్పణ, దుప్తార్ బందీ, సలాం వంటి కార్యక్రమాలతో ఉరుసు మహోత్సవాలు ముగిస్తాయని ధర్మకర్త అతావుల్లా బాబా పేర్కొన్నారు. వేడుకలకు వచ్చే భక్తులు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ధర్మకర్త అతావుల్లా బాబా తెలిపారు.

విజయనగరం జిల్లాలోని బాబామెట్ట దర్గా దర్బార్​లో.. హజరత్ తాజ్ ఖాదర్ వలీబాబా 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్ధనలతో ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయని దర్బార్ ముతవల్లి (ధర్మకర్త) మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా తెలిపారు. అనంతరం జెండా ఉత్సవం, ఛాదర్ సమర్పణ వంటి ఉత్సవ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఖాదర్ బాబా దర్గా షరీఫ్ వద్ద ఖురాన్ పఠనం ఉంటుందని తెలిపారు.

ఉదయం 10 గంటలకు దర్భార్ షరీఫ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై.. హజరత్ తాజ్ ఖాదర్ వలీ బాబా, నషాన్, చాదర్, సందల్ షరీఫ్​లతో పాటు ఫకీరు మేళా ఖవ్వాలితో నగర పుర వీధుల్లోకి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. చాదర్ సమర్పణ, దుప్తార్ బందీ, సలాం వంటి కార్యక్రమాలతో ఉరుసు మహోత్సవాలు ముగిస్తాయని ధర్మకర్త అతావుల్లా బాబా పేర్కొన్నారు. వేడుకలకు వచ్చే భక్తులు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ధర్మకర్త అతావుల్లా బాబా తెలిపారు.

ఇదీ చదవండి:

తల్లాపురంలో తెదేపా, వైకాపాల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.