విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు ధర్నా చేశారు. నూతనంగా 104,108 వాహనాలను ప్రారంభించిన ప్రభుత్వం.. 104 ఉద్యోగులను రోడ్డున పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కమిటీ సమక్షంలో ఉన్నతమైన హామీలుఇచ్చారని వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 1వ తేదీ నుంచి 104 ఉద్యోగులను కొనసాగించాలని.. పెంచిన జీతాలు ఇవ్వాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులంతా ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ