ETV Bharat / state

అప్పుడు నిరుద్యోగి.. నేడు పర్యావరణహిత వాణిజ్యవేత్త

author img

By

Published : Feb 27, 2022, 4:29 PM IST

కరోనా మహమ్మారి వల్ల నిరుద్యోగిగా నిలిచిన ఆ విద్యాధికురాలు నేడు పర్యావరణ హిత వాణిజ్యవేత్తగా నిలదొక్కుకున్నారు. రాష్ట్రంలోనే ప్లాస్టిక్ రహిత టీ కప్పుల తయారీలో ఆమె ఒక ఒరవడిని రూపొందించారు. దేశంలోని ఆరు రాష్ట్రాలకు నేరుగా తినగలిగే టీ కప్పులను విక్రయిస్తూ.. ఆదాయాన్ని ఆర్జించడమేగాక పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.

తమ్మినైన విజయలక్ష్మి
తమ్మినైన విజయలక్ష్మి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినైన విజయలక్ష్మి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ పట్టా సాధించారు. భర్త శ్రీనివాసరావు విశాఖలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండటంతో నగరంలోనే స్థిరపడ్డారు. ఇక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసేవారు. కరోనా సమయంలో.. ఆమె ఉద్యోగం పోవడంతో ఇంటివద్దే ఉన్నారు. ఆ సమయంలోనే భర్త శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును.. భర్త ఆరోగ్యం కోసం వినియోగించడంతో తిరిగి ఆమె ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది.

తమ్మినైన విజయలక్ష్మి

ప్లాస్టిక్ భూతం వల్ల భర్తకు ఎదురైన అనారోగ్యం ఆమెను మానసికంగా వెంటాడుతూనే ఉంది. ఆ సమయంలోనే ప్లాస్టిక్‌ను నివారించే ఉత్పత్తులను తను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేరుగా తినేందుకు అవకాశం కలిగిన టీ కప్పులు తయారీ మెషీన్లను విక్రయిస్తోంది అని తెలుసుకున్నారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని, కెనరా బ్యాంకు రుణంతో జోడిస్తూ ఎడిబుల్ టీ కప్స్ యంత్రాలను కొనుగోలు చేసి.. విశాఖలో శ్రీహర్ష ఎంటర్ప్రైజెస్ పేరిట పరిశ్రమను స్థాపించారు.

ఈ యంత్రాలలో మైదా పిండితో మాత్రమే కప్పులు తయారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే.. మైదాతో కప్పుల తయారీ వల్ల చిన్న పిల్లలకు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యం కలుగుతుందని గుర్తించి.. ప్రత్యామ్నాయ కప్పుల తయారీకి అనేక ప్రయోగాలు చేశారు. అలా రాగి పిండి, వరి పిండితో టీ కప్పులు చేసే విధానాన్ని రూపొందించుకొని ఉత్పత్తి ప్రారంభించారు. 80 మిల్లీలీటర్ల కప్పు మూడు రూపాయలకు, 60 మిల్లీలీటర్లు కప్పు రెండు రూపాయలకు విక్రయిస్తున్నారు. చాక్లెట్ వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, సువాసనలతో ఈ కప్పులు రూపొందుతున్నాయి. టీ కప్పులతోపాటు ఆకులతో భోజనం ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీ హర్ష ఎంటర్‌ ప్రైజెస్‌ ద్వారా విజయలక్ష్మి రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, చత్తీస్‌గడ్‌, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాలకు టీ కప్పులను విక్రయిస్తూ నెలకు 40 లక్షల మేర వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

'దేశభక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది'

శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినైన విజయలక్ష్మి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ పట్టా సాధించారు. భర్త శ్రీనివాసరావు విశాఖలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండటంతో నగరంలోనే స్థిరపడ్డారు. ఇక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసేవారు. కరోనా సమయంలో.. ఆమె ఉద్యోగం పోవడంతో ఇంటివద్దే ఉన్నారు. ఆ సమయంలోనే భర్త శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును.. భర్త ఆరోగ్యం కోసం వినియోగించడంతో తిరిగి ఆమె ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది.

తమ్మినైన విజయలక్ష్మి

ప్లాస్టిక్ భూతం వల్ల భర్తకు ఎదురైన అనారోగ్యం ఆమెను మానసికంగా వెంటాడుతూనే ఉంది. ఆ సమయంలోనే ప్లాస్టిక్‌ను నివారించే ఉత్పత్తులను తను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేరుగా తినేందుకు అవకాశం కలిగిన టీ కప్పులు తయారీ మెషీన్లను విక్రయిస్తోంది అని తెలుసుకున్నారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని, కెనరా బ్యాంకు రుణంతో జోడిస్తూ ఎడిబుల్ టీ కప్స్ యంత్రాలను కొనుగోలు చేసి.. విశాఖలో శ్రీహర్ష ఎంటర్ప్రైజెస్ పేరిట పరిశ్రమను స్థాపించారు.

ఈ యంత్రాలలో మైదా పిండితో మాత్రమే కప్పులు తయారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే.. మైదాతో కప్పుల తయారీ వల్ల చిన్న పిల్లలకు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యం కలుగుతుందని గుర్తించి.. ప్రత్యామ్నాయ కప్పుల తయారీకి అనేక ప్రయోగాలు చేశారు. అలా రాగి పిండి, వరి పిండితో టీ కప్పులు చేసే విధానాన్ని రూపొందించుకొని ఉత్పత్తి ప్రారంభించారు. 80 మిల్లీలీటర్ల కప్పు మూడు రూపాయలకు, 60 మిల్లీలీటర్లు కప్పు రెండు రూపాయలకు విక్రయిస్తున్నారు. చాక్లెట్ వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, సువాసనలతో ఈ కప్పులు రూపొందుతున్నాయి. టీ కప్పులతోపాటు ఆకులతో భోజనం ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీ హర్ష ఎంటర్‌ ప్రైజెస్‌ ద్వారా విజయలక్ష్మి రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, చత్తీస్‌గడ్‌, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాలకు టీ కప్పులను విక్రయిస్తూ నెలకు 40 లక్షల మేర వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

'దేశభక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.