ETV Bharat / state

గంజాయి అక్రమ రవాణ... విద్యార్థులే కీలకం - గంజాయి అక్రమరవాణ

చెడు వ్యసనాలు...ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశ నేటి యువతను తప్పుదోవ పట్టిస్తోంది. పుస్తకాలు ఉండాల్సిన బ్యాగ్గుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టి కాలేజీల్లోనే అమ్మకాలకు దిగుతున్నారు. గంజాయి విక్రయాల్లో ఎక్కవశాతం విద్యార్థులే అని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పలు చోట్ల చేసిన తనిఖీల్లో అక్రమార్కులను అరెస్టు చేశారు.

పట్టుబడిన గంజాయి ముఠా
author img

By

Published : Nov 4, 2019, 11:29 PM IST

గంజాయిని పట్టుకున్న పోలీసులు

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి... రవాణాదారులను అరెస్టు చేస్తున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం కొత్త ఆలోచనలతో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. ఈ రోజే నాలుగుచోట్ల గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు ఉండటం గమనార్హం.

చిత్తూరు జిల్లా....
కళాశాలలోనే గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చిత్తూరు జిల్లా తిరుపతి తూర్పు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. కళాశాలలోని మరికొంత మంది స్నేహితులతో కలిసి తమిళనాడు వేలూరులో తాము చదువుకుంటున్న విట్ కళాశాలలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 7కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కేజీ 5వేలకు కొనుగోలు చేసి కళాశాలలో... కేజీ 9వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లా...
నెల్లూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరి నుంచి లక్షా 60 వేల రూపాయల విలువ చేసే 16 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా వేలూరులోని విట్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లా అరకులో గంజాయి కొనుగోలు చేసి కళాశాలలో విక్రయిస్తున్నట్లు కావలి డీఎస్​పీ ప్రసాద్ తెలిపారు.

విశాఖ జిల్లా...
విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి నుంచి రాజమండ్రి తరలిస్తున్న 2.5లక్షల విలువైన 110 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లా రాయాపురం గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారనే సమాచారంతో మడకశిర సీఐ దేవానంద్ సిబ్బంది దాడులు జరిపారు. ఇంటి పరిసరాల్లో ఆరడుగుల ఎత్తుగల సుమారు 89 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అరెస్టు చేశారు.

ఎన్ని దాడులు జరిగిన గంజాయి అక్రమ రవాణను మాత్రం పోలీసులు అరికట్టలేకపోతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే దీనిని అరికట్టవచ్చని ప్రజలంటున్నారు.

ఇదీ చూడండి

తెలంగాణలో దారుణం.. తహశీల్దార్ సజీవ దహనం

గంజాయిని పట్టుకున్న పోలీసులు

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి... రవాణాదారులను అరెస్టు చేస్తున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం కొత్త ఆలోచనలతో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. ఈ రోజే నాలుగుచోట్ల గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు ఉండటం గమనార్హం.

చిత్తూరు జిల్లా....
కళాశాలలోనే గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చిత్తూరు జిల్లా తిరుపతి తూర్పు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. కళాశాలలోని మరికొంత మంది స్నేహితులతో కలిసి తమిళనాడు వేలూరులో తాము చదువుకుంటున్న విట్ కళాశాలలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 7కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కేజీ 5వేలకు కొనుగోలు చేసి కళాశాలలో... కేజీ 9వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లా...
నెల్లూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరి నుంచి లక్షా 60 వేల రూపాయల విలువ చేసే 16 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా వేలూరులోని విట్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లా అరకులో గంజాయి కొనుగోలు చేసి కళాశాలలో విక్రయిస్తున్నట్లు కావలి డీఎస్​పీ ప్రసాద్ తెలిపారు.

విశాఖ జిల్లా...
విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి నుంచి రాజమండ్రి తరలిస్తున్న 2.5లక్షల విలువైన 110 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లా రాయాపురం గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారనే సమాచారంతో మడకశిర సీఐ దేవానంద్ సిబ్బంది దాడులు జరిపారు. ఇంటి పరిసరాల్లో ఆరడుగుల ఎత్తుగల సుమారు 89 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అరెస్టు చేశారు.

ఎన్ని దాడులు జరిగిన గంజాయి అక్రమ రవాణను మాత్రం పోలీసులు అరికట్టలేకపోతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే దీనిని అరికట్టవచ్చని ప్రజలంటున్నారు.

ఇదీ చూడండి

తెలంగాణలో దారుణం.. తహశీల్దార్ సజీవ దహనం

FILE NAME : ap_atp_77_04_ganjai_mokkalu_swadhinam_avb_ap10175. గంజాయి మొక్కలు సాగు చేసిన నలుగురు వ్యక్తులను, 89 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు మడకశిర పోలీసులు. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలోని యస్. రాయాపురం గ్రామంలో ఇంటి ఆవరణంలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు అనే సమాచారంతో మడకశిర సీఐ దేవానంద్ మరియు సిబ్బంది దాడులు జరపగా హనుమంతరాయప్ప,సిద్దేష్ ,నాగప్ప ,శివలింగప్పల ఇంటి పరిసరాల్లో ఆరు అడుగుల ఎత్తుగల సుమారు 89 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని సంబంధిత అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకొని ఆ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 89 గంజాయి మొక్కలు s. రాయపురం గ్రామంలో స్వాధీనం చేసుకున్నాం. వాటి సాగు దారులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం అయినది అని సిఐ తెలిపారు. బైట్స్ : దేవానంద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మడకశిర. యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర. మొబైల్ నెంబర్ : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.