ETV Bharat / state

ప్రమాదకర స్థాయికి డుడుమా జలాశయ నీటిమట్టం.. దిగువకు నీరు విడుదల - డుడుమా జలాశయం

విశాఖ జిల్లాలోని డుడుమా జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 2 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

water released from duduma reservoir vizag district
డుడమా జలాశయం
author img

By

Published : Aug 13, 2020, 3:20 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం ప్రమాదకర స్థాయికి చేరింది. 2590 అడుగుల సామర్థ్యం కలిగిన డుడుమాలో నీటి మట్టం 2589.9 అడుగులకు చేరింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువున ఉన్న జోలపుట్ జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేశారు.

ఇవీ చదవండి...

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం ప్రమాదకర స్థాయికి చేరింది. 2590 అడుగుల సామర్థ్యం కలిగిన డుడుమాలో నీటి మట్టం 2589.9 అడుగులకు చేరింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువున ఉన్న జోలపుట్ జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేశారు.

ఇవీ చదవండి...

432 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.