ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం ప్రమాదకర స్థాయికి చేరింది. 2590 అడుగుల సామర్థ్యం కలిగిన డుడుమాలో నీటి మట్టం 2589.9 అడుగులకు చేరింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువున ఉన్న జోలపుట్ జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేశారు.
ఇవీ చదవండి...