ETV Bharat / state

లాఠీ తగిలి వ్యక్తికి గాయాలు.. తాటితూరు పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత

author img

By

Published : Feb 21, 2021, 6:18 PM IST

జన సమూహాలను చెదరగొట్టే క్రమంలో భీమునిపట్నం మండలం తాటితూరు పోలింగ్ కేంద్రం వద్ద.. పోలీసులు చేసిన ప్రయత్నంతో.. స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసు లాఠీ తగిలి వ్యక్తికి గాయం కాగా.. బాధితుడి తరఫున కొందరు వాగ్వాదానికి దిగారు.

తాటితూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
తాటితూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరు పోలింగ్ కేంద్రంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జన సమూహాన్ని చెదరగొట్టే సమయంలో వేముల రమణ అనే వ్యక్తి మోకాలికి.. లాఠీ తగిలి గాయమైంది. గాయం కారణంగా రక్త స్రావమై బాధితుడు ఇబ్బంది పడ్డాడు.

అతడి తరఫున కొందరు స్థానికులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చికిత్స నిమిత్తం బాధితుడిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. సంఘటనా స్థలానికి ఏసీపీ రవిశంకరరెడ్డి వెళ్లి.. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరు పోలింగ్ కేంద్రంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జన సమూహాన్ని చెదరగొట్టే సమయంలో వేముల రమణ అనే వ్యక్తి మోకాలికి.. లాఠీ తగిలి గాయమైంది. గాయం కారణంగా రక్త స్రావమై బాధితుడు ఇబ్బంది పడ్డాడు.

అతడి తరఫున కొందరు స్థానికులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చికిత్స నిమిత్తం బాధితుడిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. సంఘటనా స్థలానికి ఏసీపీ రవిశంకరరెడ్డి వెళ్లి.. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి:

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.