విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరు పోలింగ్ కేంద్రంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జన సమూహాన్ని చెదరగొట్టే సమయంలో వేముల రమణ అనే వ్యక్తి మోకాలికి.. లాఠీ తగిలి గాయమైంది. గాయం కారణంగా రక్త స్రావమై బాధితుడు ఇబ్బంది పడ్డాడు.
అతడి తరఫున కొందరు స్థానికులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చికిత్స నిమిత్తం బాధితుడిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. సంఘటనా స్థలానికి ఏసీపీ రవిశంకరరెడ్డి వెళ్లి.. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: