ETV Bharat / state

విశాఖ భూకుంభకోణం గుట్టు విప్పిన సిట్‌.. సీఎంవోదే ‘కీలకపాత్ర’

author img

By

Published : Nov 26, 2022, 6:56 AM IST

CMO Key Role In Visakha Land scam: విశాఖ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యంతోనే కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన విషయం బయటికొచ్చింది. అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించడంలో C.M.O పాత్ర ఎంతో కీలకమని... ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, ఆ తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతో N.O.Cల జారీ చకచకా సాగిపోయింది. నిరంతరం జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన ఆదేశాలు ఇస్తూ, అనుమతులు ఇప్పించడంపై CMO ప్రత్యేక శ్రద్ధ చూపింది. జిల్లా అధికారులు కాదూ-కూడదన్నా... అనుమతులు మంజూరయ్యాయంటే ఉన్నతస్థాయి ఒత్తిడి ఏ విధంగా పనిచేసిందో అర్థమవుతోంది.

CMO Key Role In Visakha Land scam
CMO Key Role In Visakha Land scam

CMO Key Role In Issuance Of NOC: ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు డీఫాం భూములు ఇచ్చినట్లు అధికారికంగా నిర్ధారించే రికార్డే లేదు. ఒరిజనల్‌ డీఫాం పట్టాలు లేవు. అవి నకిలీ పట్టాలు మొర్రో అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా దిక్కు లేదు. ఉన్నతస్థాయి ప్రమేయంతోనే ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. 2006లో పదెకరాల వ్యవసాయ భూమి కేటాయించి... 2008లో అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయించినా.. ఆ స్థలాలను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నా.. వాళ్ల వారసులు ఇప్పటికీ నిరుపేదల్లా బతుకుతున్నారంటే అసలేం జరిగిందో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. డీఫాం పట్టా లేకపోయినా, నకళ్లతో దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైన లబ్ధిదారులు... సీఎంవోలో దరఖాస్తులివ్వగానే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలొచ్చి.. ఉరుకులు పరుగులమీద ఎన్​వోసీలు జారీ అయ్యారంటే ఏం జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇలాంటి చిత్రవిచిత్రాల మధ్య నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతో చేతులు మారిన భూములు అచ్చంగా 25.79 ఎకరాలు. ఈ భూములు ఎక్కడో మారుమూల పల్లెల్లోనివి కాదు.. ప్రస్తుతం విశాఖ నగరంలో భాగమైన భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో.

మూడేళ్లలోనే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం: సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ భూమి కేటాయిస్తే, డీఫాం పట్టా ఇస్తే.. అమ్ముకోవడానికి కొన్నేళ్లు ఆగాలి. కానీ 2006లో కాపులుప్పాడ వద్ద 10 ఎకరాల భూమి స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పేరుతో కేటాయించి.. మూడేళ్లయినా కాకుండానే అమ్మేసుకున్నారు. దాదాపు 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎంత సులువుగా కేటాయించారో, అడ్డగోలుగా అమ్ముకోవడానికి ఎలా అనుమతిచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. ఈ వ్యవహారంలో నాటి అధికారులు, ప్రభుత్వ స్థాయిలో అనధికారుల పాత్రపై విచారణ చేయించాలని సిట్‌ సిఫారసు చేసింది. అప్పటి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి వెంకటసుబ్బయ్య తప్పుడు నోట్‌ పెట్టినట్లు అనుమానం వ్యక్తంచేసింది. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన భూమి ఎసైన్‌మెంట్‌కు దోహదపడ్డారని పేర్కొంది.

సరైన క్రిమినల్‌ విచారణ జరిపితే... తెరవెనుక వ్యక్తులను బయటికి తేవచ్చని సూచించింది. ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం కాకుండా, దళారులే లాభపడ్డారని తేల్చిచెప్పింది. ఈ కేసులో స్వాతంత్య్ర సమరయోధుడు రంగూరి అప్పారావు భార్య రంగూరి మీనాక్షి పేరుతో రెండుచోట్ల విడివిడిగా 2.99 ఎకరాలు, 7.01 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిపాదనను అనేకసార్లు జేసీలు తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఎసైన్‌మెంట్‌ కింద విశాఖలో వ్యవసాయ భూమి కేటాయించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ... ఆ దరఖాస్తును కలెక్టర్‌ అప్పారావు రెండుసార్లు తిరస్కరించారు.

ఆ తర్వాత రంగూరి మీనాక్షి పేరుతో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందింది. మంత్రి కలెక్టర్‌కు పంపారు. కలెక్టర్‌ తిరస్కరించినా ప్రత్యేక కేసుగా పరిగణించిన ప్రభుత్వం.. ఆమెకు భూమి కేటాయించింది. 2006 జూన్‌ 4న పట్టా, జూన్‌ 8న పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చేశారు. మీనాక్షి పేరుతో కేటాయించిన పదెకరాల భూమిని అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముందే తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని హైదరాబాద్‌లోని ACB ఏసీపీ సంపత్‌కు లేఖ వెళ్లింది.

ఈ భూమి అమ్ముకుంటానంటూ 2007 ఏప్రిల్‌లో మీనాక్షి పేరుతో సీఎంవో కు దరఖాస్తు అందింది. దాన్ని అప్పటి జిల్లా కలెక్టర్‌కు పంపారు. వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్న మీనాక్షి... చిట్టివలసలో మూడో కుమారుడు విశ్వేశ్వరరావు వద్ద ఉంటున్నారని భీమునిపట్నం తహసీల్దారు నివేదించారు. స్వాతంత్య్ర సమరయోధులు పదేళ్ల తర్వాత భూమి అమ్ముకునేందుకు అర్హత ఉంటుందని, కానీ భూమి కేటాయించి ఏడాది మాత్రమే అయిందని 2007 నవంబరు 29న సీసీఎల్​ఏకి కలెక్టర్‌ నివేదించారు. అయినా ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ భూమి అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం మెమో ఇచ్చింది.

ఈ భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, భీమునిపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలివ్వాలని... మామపల్లి లక్ష్మి, భాస్కరరావు, విశ్వేశ్వరరావు, రత్నం అనే వ్యక్తులు కలెక్టర్‌ను కోరారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, అమ్ముకునేందుకు కలెక్టర్‌ వీలు కల్పించారు. 2008 మార్చిలో మీనాక్షి చనిపోగా, ఆమె వారసులు అదే ఏడాది ఆగస్టులో పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించారు. ఆ భూములను కొవ్వూరు వెంకట సత్యనారాయణరెడ్డి, మంతెన నాగమణి మూడెకరాల చొప్పున, పెన్మత్స సత్యనారాయణరాజు, ఇందుకూరి కృష్ణంరాజు రెండెకరాల చొప్పున కొన్నారు.

ఆ భూములు తమవంటూ కడప జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ బోర్డులు పెట్టారని సిట్‌ గుర్తించింది. 60 కోట్ల విలువైన భూమిని అమ్మిన రంగూరి మీనాక్షి వారసులు.. ఇప్పటికీ చిన్నచిన్న పనులు చేస్తూ బతుకు బండి లాగుతున్నారని తేల్చింది. ఇక్కడ అసలు లబ్ధిదారులు వేరని గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలు సడలించడం ద్వారా 80 ఏళ్ల మీనాక్షికి 10 ఎకరాల ఎసైన్డ్‌ భూమి కేటాయింపు, అమ్మకం వ్యవహారమంతా పూర్తిగా బయటి వ్యక్తులే నడిపించారని సిట్‌ తేల్చింది.

నకిలీపట్టాలని అనుమానించినా.. భూమి అమ్మకాలకు అనుమతి: కాపులుప్పాడలోనే మరో అయిదెకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. నకిలీ పట్టాను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే ఎన్వోసీలు జారీ అయ్యాయని సిట్‌ తేల్చింది. విశ్రాంత సైనికోద్యోగి అయిన తన భర్త తిరుమలశెట్టి మోహన్‌బాబుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆయన చనిపోయినందున స్థలం అమ్మకానికి ఎన్వోసీ ఇవ్వాలంటూ తిరుమలశెట్టి శివకామేశ్వరి పేరుతో జిల్లా అధికారులకు దరఖాస్తు అందింది. జిల్లా అధికారులు అది నకిలీ పట్టాగా అనుమానించి ససేమిరా అన్నారు.

సీఎంవో జోక్యం చేసుకుని దస్త్రాన్ని కదిపింది. నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన... భూములు అమ్ముకునే ఫైలుకు అనుమతిస్తూ సిఫార్సు చేశారు. వెంటనే ప్రభుత్వస్థాయిలో మెమో జారీ అయింది. అయితే... 1992లో ప్రభుత్వం భూమి కేటాయించగా తన భర్త 2003లో చనిపోయారని, అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ 2006లో జేసీకి శివకామేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సర్వే నంబరులో డీఫాం పట్టా ఇచ్చినట్లు ఎలాంటి రికార్డు దొరకలేదని తహసీల్దార్ పేర్కొన్నారు. 10(1) అడంగల్‌లో మాత్రం ఆ పేరుతో నమోదై ఉందన్నారు.

దరఖాస్తు రిజిస్టర్‌లో పేరు లేనందున ఎన్వోసీ జారీ చేయలేమంటూ నాటి జేసీ తిరస్కరించారు. శివకామేశ్వరి హైకోర్టును ఆశ్రయించగా... పునఃపరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత శివకామేశ్వరి స్వయంగా లేదా న్యాయవాది సాయంతో వచ్చి డాక్యుమెంట్లు చూపించాలని... అప్పటి జేసీ మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆమె హాజరుకాలేకపోతే అందుబాటులో ఉన్న రికార్డు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నోటీసివ్వడానికి వెళితే శివకామేశ్వరి ఆ చిరునామాలో లేరని.. మండల రెవెన్యూ అధికారి తెలియజేశారు. పిటిషనర్‌ జేసీ ముందు హాజరుకాలేదు. తన దగ్గరున్న డీఫాం పట్టా చూపించలేదు. అందువల్ల ఎన్వోసీ జారీకి నిరాకరిస్తున్నామంటూ శివకామేశ్వరి చిరునామాకు జేసీ రిజిస్టర్‌ పోస్టులో సమాచారం పంపారు. అక్కడ ఆమె లేరంటూ ఆ పత్రం తిరుగుటపాలో వచ్చేసింది.

ఆ తర్వాత దరఖాస్తుదారు సీఎంవోలో మళ్లీ వినతిపత్రం ఇచ్చారు. అప్పటి నుంచి సీఎంవో, జిల్లా కలెక్టరేట్‌ మధ్య అనేకసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఈ భూమికి సంబంధించి ఎన్వోసీ జారీ కుదరదని జిల్లా అధికారులు అనేకసార్లు తిరస్కరించినా... వారిని హైదరాబాద్‌కు రప్పించి మరీ రెవెన్యూ ఉన్నతాధికారులు చర్చించారు. ఆ తర్వాత భూమి అమ్ముకునేందుకు ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చేసింది. 2008 ఏప్రిల్‌ 26న ప్రభుత్వం మెమో జారీ చేయగా, మే 21న జిల్లా కలెక్టర్‌ ఎన్వోసీ ఇచ్చేశారు. తదనుగుణంగా 22A రిజిస్టర్‌ నుంచి ఆ భూములను తొలగించారు.

అనేక అనుమానాలున్నా..: ఈ భూమిని రుద్రరాజు రామకృష్ణంరాజు, పరిమి విజయలక్ష్మి, బుద్ధరాజు మెహర్‌ప్రసాద్, అల్లూరి రామకృష్ణవర్మ కొనుగోలు చేశారు. అయితే... మాజీ సైనికోద్యోగి పేరుతో 1992లో మోహన్‌బాబుకు భూమి ఇచ్చినట్లు చెబుతుండగా... అప్పటికి ఆయన సైనికోద్యోగిగానే ఉన్నారు. ఎసైన్‌ చేశారని చెబుతున్న ఫసలీ సంవత్సరం 1402లో సంబంధిత రికార్డుల్లో ఆయన పేరు లేదు. దరఖాస్తు రిజిస్టర్‌లో కూడా ఆధారాలు లభించలేదు. అసలు డీపట్టా అందుబాటులో లేదు. తమ వద్ద ఉందని చెబుతున్న పట్టా ప్రతిపై ఉన్న తహసీల్దార్ సంతకం, అప్పటి భీమునిపట్నం తహసీల్దార్ సంతకానికి భిన్నంగా ఉంది.

ఆ భూమి కొండ పోరంబోకుగా రికార్డులో నమోదై ఉంది. ఎవరికైనా భూమి ఎసైన్‌ చేస్తే... కొండ పోరంబోకు నుంచి తహసీల్దార్ వేరుచేసి చూపాలి. కానీ అలాంటి దాఖలాల్లేవు. ఈ కారణాలతో అసలు భూమి ఎసైన్‌ చేశారన్న విషయంపైనే అనుమానాలు ఉన్నాయని సిట్‌ స్పష్టంచేసింది. ఇన్ని అనుమానాలు ఉన్నా... భూమి అమ్ముకునేందుకు వీలుగా ఎన్వోసీ జారీ చేయడంలో C.M.O, నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకంగా వ్యవహరించారని తేల్చింది.

కేటాయింపులపైనా అనుమానాలే.. అయినా అమ్మేసుకోమన్నారు!: కాపులుప్పాడలో ఏకంగా 10.79 ఎకరాలను అమ్ముకోవడానికి నాటి సీఎంవో ప్రత్యేక జోక్యంతో నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. వెంకటేశ్వర్లు, తోకాడ రాములు, బ్రహ్మయ్యకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించిన భూములను ఎన్వోసీ లేకుండా కొన్నానని, విక్రయానికి వీలుగా నిరభ్యంతర పత్రం ఇప్పించాలని కాళీ ప్రసాదరావు అనే వ్యక్తి 2009 జులై 9న సీఎంవోలో వినతిపత్రం అందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విశాఖ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

ఎన్వోసీ జారీకి ప్రభుత్వమే మెమో ఇచ్చింది..: భీమునిపట్నం తహసీల్దార్, విశాఖపట్నం R.D.O విచారించి... ఆ ముగ్గురికి భూమిని ఎసైన్‌ చేసినట్లుగా రికార్డుల్లో ఆధారాలు లభించలేదని, అవి నకిలీ పట్టాలు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయినా రెవెన్యూ ఉన్నతాధికారుల సాయంతో దస్త్రాన్ని పరుగులు పెట్టించారు. భూముల విక్రయానికి N.O.C జారీ చేయాలని 2010 మే 21న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టర్‌కు మెమో పంపింది. ఆ తర్వాత కాళీ ప్రసాదరావుకు ఎన్వోసీ జారీ చేస్తూ, భూములను 22A నుంచి తొలగిస్తూ జూన్‌ 7న విశాఖ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2010 జులై నుంచి 2013 ఫిబ్రవరి మధ్య ఈ భూములను కాళీ ప్రసాదరావు ఏడుగురికి విక్రయించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన మెమోను తిరిగి పరిశీలించాలని... 2013 జులై 26న అప్పటి విశాఖ కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెంకటేశ్వర్లు, రాములు, బ్రహ్మయ్య అనే ముగ్గురికి మాజీ సైనికోద్యోగుల కోటాలో భూమిని ఎసైన్‌ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు లేవని చెప్పారు. 1992లో ఎసైన్‌ చేసినట్లు డీపట్టాలు చూపుతున్నారని వివరించారు.

ఉద్యోగ విరమణ చేసిన 46 ఏళ్లకు పట్టాలిచ్చారా!: 1962లో వెంకటేశ్వర్లు, 1974లో రాములు, 1946లో బ్రహ్మయ్య... సైన్యం నుంచి బయటకొచ్చారని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సమాచారమిచ్చినట్లు కలెక్టర్‌ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సైన్యం నుంచి బయటకొచ్చాక ఏడాదిలోపు భూములు కేటాయించాలి. ఈ కేసులో వెంకటేశ్వర్లు సైన్యం నుంచి వచ్చిన 30 సంవత్సరాలకు, రాములుకు 18 ఏళ్లకు, బ్రహ్మయ్యకు 46 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూములు ఇచ్చినట్లు డీపట్టాలు ఉన్నాయి.

విశాఖ భూకుంభకోణం గుట్టు విప్పిన సిట్‌.. సీఎంవోదే ‘కీలకపాత్ర’

ఇవీ చదవండి:

CMO Key Role In Issuance Of NOC: ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు డీఫాం భూములు ఇచ్చినట్లు అధికారికంగా నిర్ధారించే రికార్డే లేదు. ఒరిజనల్‌ డీఫాం పట్టాలు లేవు. అవి నకిలీ పట్టాలు మొర్రో అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా దిక్కు లేదు. ఉన్నతస్థాయి ప్రమేయంతోనే ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. 2006లో పదెకరాల వ్యవసాయ భూమి కేటాయించి... 2008లో అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయించినా.. ఆ స్థలాలను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నా.. వాళ్ల వారసులు ఇప్పటికీ నిరుపేదల్లా బతుకుతున్నారంటే అసలేం జరిగిందో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. డీఫాం పట్టా లేకపోయినా, నకళ్లతో దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైన లబ్ధిదారులు... సీఎంవోలో దరఖాస్తులివ్వగానే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలొచ్చి.. ఉరుకులు పరుగులమీద ఎన్​వోసీలు జారీ అయ్యారంటే ఏం జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇలాంటి చిత్రవిచిత్రాల మధ్య నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతో చేతులు మారిన భూములు అచ్చంగా 25.79 ఎకరాలు. ఈ భూములు ఎక్కడో మారుమూల పల్లెల్లోనివి కాదు.. ప్రస్తుతం విశాఖ నగరంలో భాగమైన భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో.

మూడేళ్లలోనే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం: సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ భూమి కేటాయిస్తే, డీఫాం పట్టా ఇస్తే.. అమ్ముకోవడానికి కొన్నేళ్లు ఆగాలి. కానీ 2006లో కాపులుప్పాడ వద్ద 10 ఎకరాల భూమి స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పేరుతో కేటాయించి.. మూడేళ్లయినా కాకుండానే అమ్మేసుకున్నారు. దాదాపు 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎంత సులువుగా కేటాయించారో, అడ్డగోలుగా అమ్ముకోవడానికి ఎలా అనుమతిచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. ఈ వ్యవహారంలో నాటి అధికారులు, ప్రభుత్వ స్థాయిలో అనధికారుల పాత్రపై విచారణ చేయించాలని సిట్‌ సిఫారసు చేసింది. అప్పటి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి వెంకటసుబ్బయ్య తప్పుడు నోట్‌ పెట్టినట్లు అనుమానం వ్యక్తంచేసింది. దీనివల్ల కోట్ల రూపాయల విలువైన భూమి ఎసైన్‌మెంట్‌కు దోహదపడ్డారని పేర్కొంది.

సరైన క్రిమినల్‌ విచారణ జరిపితే... తెరవెనుక వ్యక్తులను బయటికి తేవచ్చని సూచించింది. ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం కాకుండా, దళారులే లాభపడ్డారని తేల్చిచెప్పింది. ఈ కేసులో స్వాతంత్య్ర సమరయోధుడు రంగూరి అప్పారావు భార్య రంగూరి మీనాక్షి పేరుతో రెండుచోట్ల విడివిడిగా 2.99 ఎకరాలు, 7.01 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిపాదనను అనేకసార్లు జేసీలు తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఎసైన్‌మెంట్‌ కింద విశాఖలో వ్యవసాయ భూమి కేటాయించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ... ఆ దరఖాస్తును కలెక్టర్‌ అప్పారావు రెండుసార్లు తిరస్కరించారు.

ఆ తర్వాత రంగూరి మీనాక్షి పేరుతో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందింది. మంత్రి కలెక్టర్‌కు పంపారు. కలెక్టర్‌ తిరస్కరించినా ప్రత్యేక కేసుగా పరిగణించిన ప్రభుత్వం.. ఆమెకు భూమి కేటాయించింది. 2006 జూన్‌ 4న పట్టా, జూన్‌ 8న పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చేశారు. మీనాక్షి పేరుతో కేటాయించిన పదెకరాల భూమిని అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముందే తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని హైదరాబాద్‌లోని ACB ఏసీపీ సంపత్‌కు లేఖ వెళ్లింది.

ఈ భూమి అమ్ముకుంటానంటూ 2007 ఏప్రిల్‌లో మీనాక్షి పేరుతో సీఎంవో కు దరఖాస్తు అందింది. దాన్ని అప్పటి జిల్లా కలెక్టర్‌కు పంపారు. వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్న మీనాక్షి... చిట్టివలసలో మూడో కుమారుడు విశ్వేశ్వరరావు వద్ద ఉంటున్నారని భీమునిపట్నం తహసీల్దారు నివేదించారు. స్వాతంత్య్ర సమరయోధులు పదేళ్ల తర్వాత భూమి అమ్ముకునేందుకు అర్హత ఉంటుందని, కానీ భూమి కేటాయించి ఏడాది మాత్రమే అయిందని 2007 నవంబరు 29న సీసీఎల్​ఏకి కలెక్టర్‌ నివేదించారు. అయినా ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ భూమి అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం మెమో ఇచ్చింది.

ఈ భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, భీమునిపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలివ్వాలని... మామపల్లి లక్ష్మి, భాస్కరరావు, విశ్వేశ్వరరావు, రత్నం అనే వ్యక్తులు కలెక్టర్‌ను కోరారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, అమ్ముకునేందుకు కలెక్టర్‌ వీలు కల్పించారు. 2008 మార్చిలో మీనాక్షి చనిపోగా, ఆమె వారసులు అదే ఏడాది ఆగస్టులో పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించారు. ఆ భూములను కొవ్వూరు వెంకట సత్యనారాయణరెడ్డి, మంతెన నాగమణి మూడెకరాల చొప్పున, పెన్మత్స సత్యనారాయణరాజు, ఇందుకూరి కృష్ణంరాజు రెండెకరాల చొప్పున కొన్నారు.

ఆ భూములు తమవంటూ కడప జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ బోర్డులు పెట్టారని సిట్‌ గుర్తించింది. 60 కోట్ల విలువైన భూమిని అమ్మిన రంగూరి మీనాక్షి వారసులు.. ఇప్పటికీ చిన్నచిన్న పనులు చేస్తూ బతుకు బండి లాగుతున్నారని తేల్చింది. ఇక్కడ అసలు లబ్ధిదారులు వేరని గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలు సడలించడం ద్వారా 80 ఏళ్ల మీనాక్షికి 10 ఎకరాల ఎసైన్డ్‌ భూమి కేటాయింపు, అమ్మకం వ్యవహారమంతా పూర్తిగా బయటి వ్యక్తులే నడిపించారని సిట్‌ తేల్చింది.

నకిలీపట్టాలని అనుమానించినా.. భూమి అమ్మకాలకు అనుమతి: కాపులుప్పాడలోనే మరో అయిదెకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. నకిలీ పట్టాను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే ఎన్వోసీలు జారీ అయ్యాయని సిట్‌ తేల్చింది. విశ్రాంత సైనికోద్యోగి అయిన తన భర్త తిరుమలశెట్టి మోహన్‌బాబుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆయన చనిపోయినందున స్థలం అమ్మకానికి ఎన్వోసీ ఇవ్వాలంటూ తిరుమలశెట్టి శివకామేశ్వరి పేరుతో జిల్లా అధికారులకు దరఖాస్తు అందింది. జిల్లా అధికారులు అది నకిలీ పట్టాగా అనుమానించి ససేమిరా అన్నారు.

సీఎంవో జోక్యం చేసుకుని దస్త్రాన్ని కదిపింది. నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన... భూములు అమ్ముకునే ఫైలుకు అనుమతిస్తూ సిఫార్సు చేశారు. వెంటనే ప్రభుత్వస్థాయిలో మెమో జారీ అయింది. అయితే... 1992లో ప్రభుత్వం భూమి కేటాయించగా తన భర్త 2003లో చనిపోయారని, అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ 2006లో జేసీకి శివకామేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సర్వే నంబరులో డీఫాం పట్టా ఇచ్చినట్లు ఎలాంటి రికార్డు దొరకలేదని తహసీల్దార్ పేర్కొన్నారు. 10(1) అడంగల్‌లో మాత్రం ఆ పేరుతో నమోదై ఉందన్నారు.

దరఖాస్తు రిజిస్టర్‌లో పేరు లేనందున ఎన్వోసీ జారీ చేయలేమంటూ నాటి జేసీ తిరస్కరించారు. శివకామేశ్వరి హైకోర్టును ఆశ్రయించగా... పునఃపరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత శివకామేశ్వరి స్వయంగా లేదా న్యాయవాది సాయంతో వచ్చి డాక్యుమెంట్లు చూపించాలని... అప్పటి జేసీ మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆమె హాజరుకాలేకపోతే అందుబాటులో ఉన్న రికార్డు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నోటీసివ్వడానికి వెళితే శివకామేశ్వరి ఆ చిరునామాలో లేరని.. మండల రెవెన్యూ అధికారి తెలియజేశారు. పిటిషనర్‌ జేసీ ముందు హాజరుకాలేదు. తన దగ్గరున్న డీఫాం పట్టా చూపించలేదు. అందువల్ల ఎన్వోసీ జారీకి నిరాకరిస్తున్నామంటూ శివకామేశ్వరి చిరునామాకు జేసీ రిజిస్టర్‌ పోస్టులో సమాచారం పంపారు. అక్కడ ఆమె లేరంటూ ఆ పత్రం తిరుగుటపాలో వచ్చేసింది.

ఆ తర్వాత దరఖాస్తుదారు సీఎంవోలో మళ్లీ వినతిపత్రం ఇచ్చారు. అప్పటి నుంచి సీఎంవో, జిల్లా కలెక్టరేట్‌ మధ్య అనేకసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఈ భూమికి సంబంధించి ఎన్వోసీ జారీ కుదరదని జిల్లా అధికారులు అనేకసార్లు తిరస్కరించినా... వారిని హైదరాబాద్‌కు రప్పించి మరీ రెవెన్యూ ఉన్నతాధికారులు చర్చించారు. ఆ తర్వాత భూమి అమ్ముకునేందుకు ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చేసింది. 2008 ఏప్రిల్‌ 26న ప్రభుత్వం మెమో జారీ చేయగా, మే 21న జిల్లా కలెక్టర్‌ ఎన్వోసీ ఇచ్చేశారు. తదనుగుణంగా 22A రిజిస్టర్‌ నుంచి ఆ భూములను తొలగించారు.

అనేక అనుమానాలున్నా..: ఈ భూమిని రుద్రరాజు రామకృష్ణంరాజు, పరిమి విజయలక్ష్మి, బుద్ధరాజు మెహర్‌ప్రసాద్, అల్లూరి రామకృష్ణవర్మ కొనుగోలు చేశారు. అయితే... మాజీ సైనికోద్యోగి పేరుతో 1992లో మోహన్‌బాబుకు భూమి ఇచ్చినట్లు చెబుతుండగా... అప్పటికి ఆయన సైనికోద్యోగిగానే ఉన్నారు. ఎసైన్‌ చేశారని చెబుతున్న ఫసలీ సంవత్సరం 1402లో సంబంధిత రికార్డుల్లో ఆయన పేరు లేదు. దరఖాస్తు రిజిస్టర్‌లో కూడా ఆధారాలు లభించలేదు. అసలు డీపట్టా అందుబాటులో లేదు. తమ వద్ద ఉందని చెబుతున్న పట్టా ప్రతిపై ఉన్న తహసీల్దార్ సంతకం, అప్పటి భీమునిపట్నం తహసీల్దార్ సంతకానికి భిన్నంగా ఉంది.

ఆ భూమి కొండ పోరంబోకుగా రికార్డులో నమోదై ఉంది. ఎవరికైనా భూమి ఎసైన్‌ చేస్తే... కొండ పోరంబోకు నుంచి తహసీల్దార్ వేరుచేసి చూపాలి. కానీ అలాంటి దాఖలాల్లేవు. ఈ కారణాలతో అసలు భూమి ఎసైన్‌ చేశారన్న విషయంపైనే అనుమానాలు ఉన్నాయని సిట్‌ స్పష్టంచేసింది. ఇన్ని అనుమానాలు ఉన్నా... భూమి అమ్ముకునేందుకు వీలుగా ఎన్వోసీ జారీ చేయడంలో C.M.O, నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకంగా వ్యవహరించారని తేల్చింది.

కేటాయింపులపైనా అనుమానాలే.. అయినా అమ్మేసుకోమన్నారు!: కాపులుప్పాడలో ఏకంగా 10.79 ఎకరాలను అమ్ముకోవడానికి నాటి సీఎంవో ప్రత్యేక జోక్యంతో నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. వెంకటేశ్వర్లు, తోకాడ రాములు, బ్రహ్మయ్యకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించిన భూములను ఎన్వోసీ లేకుండా కొన్నానని, విక్రయానికి వీలుగా నిరభ్యంతర పత్రం ఇప్పించాలని కాళీ ప్రసాదరావు అనే వ్యక్తి 2009 జులై 9న సీఎంవోలో వినతిపత్రం అందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విశాఖ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

ఎన్వోసీ జారీకి ప్రభుత్వమే మెమో ఇచ్చింది..: భీమునిపట్నం తహసీల్దార్, విశాఖపట్నం R.D.O విచారించి... ఆ ముగ్గురికి భూమిని ఎసైన్‌ చేసినట్లుగా రికార్డుల్లో ఆధారాలు లభించలేదని, అవి నకిలీ పట్టాలు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయినా రెవెన్యూ ఉన్నతాధికారుల సాయంతో దస్త్రాన్ని పరుగులు పెట్టించారు. భూముల విక్రయానికి N.O.C జారీ చేయాలని 2010 మే 21న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టర్‌కు మెమో పంపింది. ఆ తర్వాత కాళీ ప్రసాదరావుకు ఎన్వోసీ జారీ చేస్తూ, భూములను 22A నుంచి తొలగిస్తూ జూన్‌ 7న విశాఖ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2010 జులై నుంచి 2013 ఫిబ్రవరి మధ్య ఈ భూములను కాళీ ప్రసాదరావు ఏడుగురికి విక్రయించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన మెమోను తిరిగి పరిశీలించాలని... 2013 జులై 26న అప్పటి విశాఖ కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెంకటేశ్వర్లు, రాములు, బ్రహ్మయ్య అనే ముగ్గురికి మాజీ సైనికోద్యోగుల కోటాలో భూమిని ఎసైన్‌ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు లేవని చెప్పారు. 1992లో ఎసైన్‌ చేసినట్లు డీపట్టాలు చూపుతున్నారని వివరించారు.

ఉద్యోగ విరమణ చేసిన 46 ఏళ్లకు పట్టాలిచ్చారా!: 1962లో వెంకటేశ్వర్లు, 1974లో రాములు, 1946లో బ్రహ్మయ్య... సైన్యం నుంచి బయటకొచ్చారని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సమాచారమిచ్చినట్లు కలెక్టర్‌ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సైన్యం నుంచి బయటకొచ్చాక ఏడాదిలోపు భూములు కేటాయించాలి. ఈ కేసులో వెంకటేశ్వర్లు సైన్యం నుంచి వచ్చిన 30 సంవత్సరాలకు, రాములుకు 18 ఏళ్లకు, బ్రహ్మయ్యకు 46 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూములు ఇచ్చినట్లు డీపట్టాలు ఉన్నాయి.

విశాఖ భూకుంభకోణం గుట్టు విప్పిన సిట్‌.. సీఎంవోదే ‘కీలకపాత్ర’

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.