ETV Bharat / state

అప్పన్న కల్యాణ వేడుకకు ఏర్పాట్లు పూర్తి

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

author img

By

Published : Apr 15, 2019, 9:27 PM IST

అప్పన్న కల్యాణ వేడుకకు సుందరంగా సిద్ధమైన సింహాద్రి
అప్పన్న కల్యాణ వేడుకకు సుందరంగా సిద్ధమైన సింహాద్రి

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సింహాచలం కొండపైన ప్రత్యేకమైన క్యూలైన్లు, సింహగిరిపైకి బస్సు సదుపాయం కల్పించారు. రేపు రాత్రి 8 గంటలకు స్వామివారి రథయాత్ర జరగనున్నది. ఈ యాత్రలో స్వామివారిని రథంపై అధిష్టింపచేసి ఆలయ గాలిగోపురం చుట్టూ ఊరేగిస్తారు. రథయాత్ర అనంతరం తొమ్మిదిన్నర గంటలకు కల్యాణ మహోత్సవం జరగనుంది. స్వామి వారి కల్యాణ మండపాన్ని సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొంటారు.

ఇవీ చూడండి : ఐటీ గ్రిడ్​ వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలి: దాడి

అప్పన్న కల్యాణ వేడుకకు సుందరంగా సిద్ధమైన సింహాద్రి

విశాఖలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహ కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి స్వామి వారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సింహాచలం కొండపైన ప్రత్యేకమైన క్యూలైన్లు, సింహగిరిపైకి బస్సు సదుపాయం కల్పించారు. రేపు రాత్రి 8 గంటలకు స్వామివారి రథయాత్ర జరగనున్నది. ఈ యాత్రలో స్వామివారిని రథంపై అధిష్టింపచేసి ఆలయ గాలిగోపురం చుట్టూ ఊరేగిస్తారు. రథయాత్ర అనంతరం తొమ్మిదిన్నర గంటలకు కల్యాణ మహోత్సవం జరగనుంది. స్వామి వారి కల్యాణ మండపాన్ని సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొంటారు.

ఇవీ చూడండి : ఐటీ గ్రిడ్​ వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలి: దాడి

Intro:చిత్తూరు జిల్లా వాల్మీకి పురం శ్రీ పట్టాభిరామాలయంలో సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ పట్టాభి రామాలయంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధం గా ఉన్న ఈ ఆలయంలో లో బ్రహ్మోత్సవాలను 9 రోజులపాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు . ఇందులో భాగంగా గా ఆలయంలో లో రథోత్సవం నిర్వహించారు శ్రీ సీతారామ లక్ష్మణులను రథంపై అధిరోహింపచేసి పట్టణంలోని తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గా రథోత్సవంలో పాల్గొని స్వామి వారి భక్తిని చాటుకున్నారు రథోత్సవ ముందు చెక్క భజనలు కోలాటాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వాల్మీకి పురం తో పాటు ఉ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని సీతారాముల ను దర్శించుకున్నారు . శ్రీ పట్టాభి రామాలయంలో సీతారాముల ను వాల్మీకి మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ గ్రామానికి వాల్మీకిపురం అని పేరు వచ్చింది ఇక్కడ శ్రీ పట్టాభిరామా ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు


Body:శ్రీ పట్టాభిరామా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు


Conclusion:చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు పట్టణంలో రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు శ్రీ సీతారామ లక్ష్మణులను రథంపై అధిరోహింపచేసి పట్టణంలోని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు హరినాథ్ కంట్రిబ్యూటర్ పీలేరు8008611855
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.