విశాఖ జిల్లా సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేశారు. నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఇలియాపురం, మైసమ్మకుంట గ్రామానికి చెందిన బానోతు సైదా, తేజావత్ వినోద్, బానోతు నాగరాజు, రామావత్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు...తప్పించుకున్న మావోయిస్టులు