అకాల వర్షాల కారణంగా పంట నీట మునిగింది. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం రంగు మారకుండా ఉండేందుకు బాధిత రైతులకు అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. తడిచిన వరి పంటపై ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. పది లీటర్ల నీటిలో 500 గ్రాముల ఉప్పు కలిపి స్ప్రే చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: