విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాజెక్ట్స్ విభాగం ఆధ్వర్యంలో సఫాయి పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో 2016 నుంచి "సఫాయ్ పఖ్వాడ (ఫోర్ట్నైట్ లాంగ్ క్లీన్లినెస్ డ్రైవ్)"ను నిరంతరాయంగా పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కేకే ఘోష్.... సఫాయి పఖ్వాడ 2021 స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించారు. చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) ఆర్.శ్రీనివాసరావు సహా ఇతర సీనియర్ అధికారులు మొక్కలు నాటారు. వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ... అన్ని కార్యాలయ ప్రాంగణాలు, సైట్ కార్యాలయాలు, వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం మానేయాలని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: