ETV Bharat / state

విశాఖ మన్యంలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

ప్రకృతి అందాలు.... మ‌న‌స్సు పుల‌క‌రించే ర‌మ‌ణీయ‌మైన దృశ్యాలు. ఇవి విశాఖ మ‌న్యంలో ప్రతి ఒక్కరి మ‌దిని దోచే దృశ్యాలు. వీటిని తిలకించడానికి రోజూ వేల మంది పర్యాటకులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారు. మలుపులు తిరిగే ఘాట్‌ రోడ్‌లో ప్రయాణమంటే.. సంబరపడిపోతారు. కానీ ఇటీవల జరుగుతున్న దారిదోపిడి ఘటనలతో ఘాట్ ప్రయాణమంటే పర్యాటకులు బెంబేలేత్తిపోతున్నారు.

author img

By

Published : Jan 31, 2021, 3:15 PM IST

Provoking robbers in Visakhapatnam
విశాఖ మన్యంలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

ఆంధ్రా-ఒడిశా, ఛ‌త్తీస్​‌గఢ్‌, తెలంగాణ, మ‌ధ్యప్రదేశ్​ను క‌లుపుతూ ఉండే ఘాట్‌ రోడ్‌... ప్రస్తుతం దోపిడీ దొంగ‌ల భ‌యంతో వణుకుతోంది. ఆ దారి గుండా ప్రయాణం చేయాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి గూడెంకొత్తవీధి వరకు 49 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల.. ప్రయాణం చేయాలంటే సాహసించాల్సిందే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల.. అంతగా ఎవరూ ప్రయాణించేవారు కాదు. కాలక్రమేణా వాటి సంచారం తగ్గడంతో రాకపోకలు పెరిగాయి.

విశాఖ మన్యంలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

దారి దోపిడీ దొంగలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వాహనాలను అడ్డగించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నెలలోనే నాలుగైదు పర్యాటక వాహనాలపై దాడి చేసి.. వారి నుంచి నగదు, బంగారం కాజేశారు.

దోపిడీలకు పాల్పడుతున్నవారు ఎక్కడి వారు? ఎవరనేది? పోలీసులకు అంతుచిక్కడం లేదు. వారు ఒరియా, హిందీలో మాట్లాడుతుండటంతో స్థానికులు కాదని భావిస్తున్నారు. అయితే ఇక్కడి వారి సాయంతోనే దోపిడీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.

ఈ రహదారిలో వరుస ఘటనలు.. ఆందోళనలకు గురి చేస్తున్నాయని.. త్వరగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సంప్రదాయ, ఆధునిక కళల్లో రాణిస్తూ.. చదువులోనూ పోటాపోటీ..

ఆంధ్రా-ఒడిశా, ఛ‌త్తీస్​‌గఢ్‌, తెలంగాణ, మ‌ధ్యప్రదేశ్​ను క‌లుపుతూ ఉండే ఘాట్‌ రోడ్‌... ప్రస్తుతం దోపిడీ దొంగ‌ల భ‌యంతో వణుకుతోంది. ఆ దారి గుండా ప్రయాణం చేయాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి గూడెంకొత్తవీధి వరకు 49 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల.. ప్రయాణం చేయాలంటే సాహసించాల్సిందే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల.. అంతగా ఎవరూ ప్రయాణించేవారు కాదు. కాలక్రమేణా వాటి సంచారం తగ్గడంతో రాకపోకలు పెరిగాయి.

విశాఖ మన్యంలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు

దారి దోపిడీ దొంగలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వాహనాలను అడ్డగించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నెలలోనే నాలుగైదు పర్యాటక వాహనాలపై దాడి చేసి.. వారి నుంచి నగదు, బంగారం కాజేశారు.

దోపిడీలకు పాల్పడుతున్నవారు ఎక్కడి వారు? ఎవరనేది? పోలీసులకు అంతుచిక్కడం లేదు. వారు ఒరియా, హిందీలో మాట్లాడుతుండటంతో స్థానికులు కాదని భావిస్తున్నారు. అయితే ఇక్కడి వారి సాయంతోనే దోపిడీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.

ఈ రహదారిలో వరుస ఘటనలు.. ఆందోళనలకు గురి చేస్తున్నాయని.. త్వరగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సంప్రదాయ, ఆధునిక కళల్లో రాణిస్తూ.. చదువులోనూ పోటాపోటీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.