ETV Bharat / state

'పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ అందించాలి'

టీకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ.. వ్యాక్సిన్​ అందించాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : May 8, 2021, 4:50 PM IST

protest by tdp leaders
తెదేపా నాయకుల ధర్నా

ప్రజలకు కరోనా టీకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్​ చలనం లేకుండా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం కేంద్రంపై ఆధారపడుతున్నారని దుయ్యబట్టారు.

వైరస్​ కారణంగా అధిక సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ.. టీకా​ వేయించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, అర్బన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సురేంద్ర, పలువురు నేతలు పాల్గొన్నారు.

ప్రజలకు కరోనా టీకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్​ చలనం లేకుండా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం కేంద్రంపై ఆధారపడుతున్నారని దుయ్యబట్టారు.

వైరస్​ కారణంగా అధిక సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ.. టీకా​ వేయించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, అర్బన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సురేంద్ర, పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ప్రయాణికురాలికి అస్వస్థత.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.