
ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ చోడవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు డా. ఎం.వి.ఎస్.మూర్తి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ కష్టమైపోతుందని వారు వాపోయారు. ప్రభుత్వం దయతో ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు. నిరసనలో తమ సమస్యలను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇవీ చదవండి