విశాఖ జిల్లా కోటఉరట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 4.59 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు.. అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత బ్యాంక్ మేనేజరు పి.వెంకట సూర్యరావు ఈ పిటిషన్ వేశారు. సర్వే నెంబరు 347లోని కళాశాలకు చెందిన 4.59 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారన్నారు. గ్రామకంఠానికి చెందిన ఆ భూమిని 1977లో కళాశాలకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమి కళాశాల స్వాధీనంలో ఉందని... ఇప్పుడు దాన్ని ఇళ్లస్థలాలుగా ఎలా ఇస్తారన్నారు. కనీసం నోటీసులు సైతం ఇవ్వకుండా ఏకపక్షంగా హద్దులు నిర్ణయించారని పిటిషన్లో పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖ కలెక్టర్, ఆర్డీవో, కోటఉరట్ల తహసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చారు.
ఇవీ చదవండి:
స్థలాలు తీసుకుంటే చావే శరణ్యం...వెంగళాయపాలెంలో స్థానికుల ఆందోళన