ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి - గుమ్మడికొండలో రోడ్డు ప్రమాదాలు

వర్షం పడుతుండటంతో తొందరగా వెళ్లాలనే కంగారు.. ఓ యువకుడి మరణానికి కారణమైంది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను ఢీకొనడంతో ప్రాణాలు పోయాయి. విశాఖ జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ వద్ద జరిగిందీ ఘటన.

road accident
ట్రాక్టర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం
author img

By

Published : Nov 11, 2020, 11:09 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన రామరాజు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై గుమ్మడికొండ బయలుదేరాడు. వర్షం పడుతుండటంతో వేగంగా వెళుతూ.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా రామరాజు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నాతవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన రామరాజు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై గుమ్మడికొండ బయలుదేరాడు. వర్షం పడుతుండటంతో వేగంగా వెళుతూ.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా రామరాజు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నాతవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చింతపల్లిలో ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యుల లొంగుబాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.