చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాతవరం మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వస్తే పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి
ఇటు విజయనగరం యువరాణి... అటు వీరభద్రస్వామి