విశాఖలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గించాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా కారణంగా.. ప్రభుత్వం 30% ఫీజు తగ్గింపు కోసం జీవోనెం.57 ను జారీ చేసింది. అయితే నగరంలోని ఓ పాఠశాల ఈ ఉత్తర్వులను పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు.
ప్రస్తుతం కేవలం 100 మందికి మాత్రమే 30 శాతం ఫీజు తగ్గించటంపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు రాత్రంతా డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఇదీ చదవండీ.. పల్లె పోరు: నేటి నుంచే నామినేషన్లు.. 9న ఎన్నికలు