కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదిన్నర తరువాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులకు ఆధార్ నమోదు, ఈ కేవైసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో మన్యంలో అత్యంత మారుమూల మండలం ముంచంగిపుట్టులో మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటర్నెట్ సమస్యలతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా.. పనిపూర్తి కాకపోవడంతో రాత్రి 10 గంటలు అయినా.. అక్కడే ఉండిపోయారు. తినడానికి తిండి లేక మంచినీటితో ఆకలి తీర్చుకున్నారు. చిన్నారులు కునికాపాట్లు పడుతున్న తీరు ఆ తల్లిందండ్రుల అవస్థలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులను అడగ్గా.. పంచాయతీల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా ప్రజలు మారుమూల గ్రామాల నుంచి వస్తున్నారని చెబుతున్నారు.
ఇదీ చదవండి..
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు హాజరైన ఎమ్మెల్యే